వైజాగ్లో మూడు గ్లోబల్ ఈవెంట్స్ నిర్వహించనున్న ఇండియన్ నేవీ!
విశాఖపట్నంలో త్వరలో మూడు గ్లోబల్ ఈవెంట్స్ జరగనున్నాయి. ఇందుకోసం ఇండియన్ నేవీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు అధికారులు వెల్లడించారు.
వచ్చే ఫిబ్రవరిలో వైజాగ్ మూడు ప్రధాన అంతర్జాతీయ మారిటైమ్ ఈవెంట్స్ ఆతిథ్యం ఇవ్వనుంది. అవి అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష 2026, ఎక్సైజ్ మిలాన్ 2026, ఫిబ్రవరి 15 నుండి 25 వరకు జరిగే హిందూ మహాసముద్ర నావికా సింపోజియం కాన్క్లేవ్ ఆఫ్ చీఫ్స్. భారతదేశం ఈ ప్రధాన సముద్ర కార్యక్రమాలను ఒకేసారి నిర్వహించడం ఇదే మొదటిసారి.

'ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సంవత్సరం ప్రకటించిన Mahasagar(mutual and holistic advancement for security and growth across regions) దార్శనికతను సాకారం చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యం.' అని తూర్పు నావికాదళం ఒక ప్రకటనలో తెలిపింది.
భారతదేశ తూర్పు సముద్ర ద్వారం, తూర్పు నావికా కమాండ్కు నిలయం వద్ద జరిగే ఈ చారిత్రాత్మక సమావేశంలో పాల్గొనడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న నావికాదళాలకు ఆహ్వానాలు పంపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సముద్రంలో నౌకాదళాల సమీక్షను నిర్వహిస్తారు. INS విక్రాంత్, విశాఖపట్నం-క్లాస్ డిస్ట్రాయర్లు, నీలగిరి-క్లాస్ స్టెల్త్ ఫ్రిగేట్లు, అర్నాలా-క్లాస్ జలాంతర్గామి యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ కార్వెట్లు వంటివాటిని ప్రదర్శిస్తారు.
భారత నావికాదళ నౌకలతో పాటు స్నేహపూర్వకమైన విదేశీ దేశాల మర్చంట్ మెరైన్స్ నుండి వచ్చిన విభిన్న నౌకలు కూడా చేరనున్నాయి. MILAN హార్బర్, ఇంటర్ఆపరేబిలిటీ, మారిటైమ్ డొమైన్ అవేర్నెస్, యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్, వాయు రక్షణ, సెర్చ్ అండ్ రెస్క్యూ కార్యకలాపాలపై దృష్టి పెడుతుంది. ఇంటర్నేషనల్ సిటీ పరేడ్లో పాల్గొనే నావికాదళాలు, భారత సైన్యం, భారత వైమానిక దళం నుండి బృందాలు విశాఖపట్నం ఐకానిక్ బీచ్ ఫ్రంట్ RK బీచ్ గుండా కవాతు చేస్తాయి.
ఇంటర్నేషనల్ మారిటైమ్ సెమినర్లో సముద్ర వ్యూహాలు, సాంకేతికత, మద్దతు వంటి సమకాలీన అంశాలపై చర్చిస్తారు. IONS చీఫ్ల సమావేశంలో భారత నావికాదళం రెండవసారి (2025-2027) అధ్యక్ష పదవిని చేపట్టనుంది. ఈ కార్యక్రమంలో 25 సభ్య దేశాల నుండి నావికాదళ అధిపతులు, తొమ్మిది మంది పరిశీలకులు, ప్రత్యేకంగా ఆహ్వానించిన దేశాలు సముద్ర భద్రతపై చర్చిస్తాయి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


