ఈ వేసవి వేళ చాలా మంది అధ్యాత్మిక ప్రాంతాలను చూసేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఈ నేపథ్యంలో ఐఆర్సీటీసీ సరికొత్త టూర్ ప్యాకేజీని ప్రకటించింది. తమిళనాడులోని ప్రముఖ ఆలయాలను చూసేందుకు విజయవాడ నుంచి టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేయనుంది.

ఐఆర్సీటీసీ టూరిజం వెబ్ సైట్ లోని వివరాల ప్రకారం… ఈ ప్యాకేజీని తమిళనాడు టెంపుల్స్ అండ్ హిల్స్ EX విజయవాడ పేరుతో ఆపరేట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్యాకేజీ ఏప్రిల్ 25వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో బుకింగ్ చేసుకోవాలి. ఆసక్తి గల వాళ్లు… టికెట్లు ముందుగానే బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
- ఈ ట్రిప్ 6 రోజులు ఉంటుంది. తంజావూర్, రామేశ్వరం, మధురై, కొడైకెనాల్ వంటి పలు ప్రాంతాలను సందర్శిస్తారు. మొదటి రోజు విజయవాడ ఎయిర్ పోర్ట్ నుంచి బయల్దేరి… తిరుచ్చి విమానాశ్రయానికి చేరుకుంటారు. సాయంత్రం శ్రీనగరం ఆలయాన్నిదర్శించుకుంటారు. రాత్రికి తిరుచ్చిలోనే ఉంటారు.
- రెండో రోజు హోటల్లో అల్పాహారం ముగించుకుని… తంజావూరుకు (60 కి.మీ) ప్రయాణమవుతారు. ప్రపంచ ప్రసిద్ధ బృహదీశ్వరాలయం (Brihadeeswara Temple) సందర్శన ఉంటుంది. తంజావూరు నుండి రామేశ్వరానికి (240 కి.మీ) ప్రయాణం ఉంటుంది. రామేశ్వరం చేరుకుని హోటల్లో చెక్-ఇన్ అవుతారు., డిన్నర్ ముగించుకుని ఇక్కడే బస చేస్తారు.
- మూడో రోజు హోటల్లో అల్పాహారం ఉంటుంది. రామనాథస్వామి ఆలయం, ధనుష్కోడి, స్థానిక దేవాలయాలను చూస్తారు. రాత్రి భోజనం మరియు రామేశ్వరంలో బస.
- నాల్గో రోజు టిఫిన్ చేసిన తర్వాత మదురైకి (180 కి.మీ) వెళ్తారు. ప్రసిద్ధ మీనాక్షి అమ్మవారి ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం కొడైకెనాల్కు (120 కి.మీ) బయలుదేరుతారు.
- ఐదో రోజు కొడైకెనాల్లోని స్థానిక పర్యాటక ప్రాంతాలను (బ్రయంట్ పార్క్, గుణ గుహలు, పైన్ ఫారెస్ట్, పిల్లర్ రాక్, కొడై లేక్) చూస్తారు. రాత్రి కొడైకెనాల్ లోనే ఉంటారు.
- చివరి రోజు హోటల్ నుంచి చెక్ అవుట్ చేసి మదురైకి (120 కి.మీ) ప్రయాణవుతారు. సాయంత్రం వరకు విజయవాడ ఎయిర్ పోర్టుకు చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
ఈ ప్యాకేజీ ధరలు చూస్తే… సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. ₹51050, డబుల్ ఆక్యుపెన్సీకి రూ. 37900, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 36300గా ఉంది. ఈ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా వివరాలు తెలుసుకోవాలనుకుంటే 9281030714 నెంబర్ ను సంప్రదించవచ్చు. టికెట్ల బుకింగ్ తో పాటు ఇతర వివరాలను https://www.irctctourism.com వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు.