JNVST 2027 Application Correction : దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2027-28 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంట్రెన్స్ పరీక్షకు సంబంధించి మరో అప్డేట్ వచ్చేసింది. దరఖాస్తుల సవరణ (Correction Window) ప్రక్రియ అందుబాటులోకి వచ్చింది.

ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువు ఆగస్టు 10వ తేదీతో పూర్తయిన నేపథ్యంలో…. విద్యార్థులు తమ దరఖాస్తుల్లో ఏవైనా తప్పులు ఉంటే సరిదిద్దుకోవడానికి నవోదయ విద్యాలయ సమితి అవకాశం కల్పించింది. అభ్యర్థులు ఆగస్ట్ 12వ తేదీలోపు తమ వివరాలను ఆన్లైన్ పోర్టల్( https://cbseitms.rcil.gov.in/nvs/Edit ) ద్వారా కరెక్షన్ చేసుకోవచ్చు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 15, తెలంగాణలో 15 జవహర్ నవోదయ విద్యాలయాలు అందుబాటులో ఉన్నాయి. ఉచిత నాణ్యమైన విద్యకు నిలయమైన ఈ విద్యాలయాల్లో ప్రవేశాల కోసం ప్రతీ ఏటా లక్షలాది మంది విద్యార్థులు పోటీ పడుతుంటారు. ఈ ఎంపిక పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత బోధనతో పాటు, బాలబాలికలకు వేర్వేరుగా నాణ్యమైన వసతి, భోజన సౌకర్యాలు సంపూర్ణ ఉచితంగా కల్పిస్తారు.
నవంబర్ 28న ఎగ్జామ్….
జేఎన్వీఎస్టీ-2027 ప్రవేశ పరీక్షను 2026 నవంబర్ 28న నిర్వహించనున్నారు. ఈ పరీక్షా విధానం పూర్తిగా బహుళైచ్ఛిక (MCQ) రూపంలో ఉంటుంది. మొత్తం 100 మార్కులకు గాను 80 ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష రాసేందుకు 2 గంటల వ్యవధి కేటాయించారు. ప్రశ్నపత్రంలో ప్రధానంగా మూడు విభాగాలు ఉంటాయి.
ఈ ప్రవేశ పరీక్షలో విద్యార్థులు కనబరిచిన ప్రతిభ, సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందించి సీట్లను కేటాయిస్తారు. పరీక్షకు సంబంధించిన ఫలితాలు 2027 మార్చి చివరి వారంలో వెలువడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
{{/usCountry}}ఈ ప్రవేశ పరీక్షలో విద్యార్థులు కనబరిచిన ప్రతిభ, సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందించి సీట్లను కేటాయిస్తారు. పరీక్షకు సంబంధించిన ఫలితాలు 2027 మార్చి చివరి వారంలో వెలువడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
{{/usCountry}}జవహర్ నవోదయ విద్యాలయాల్లో సీటు వచ్చిన విద్యార్థి.. ఆరో తరగతి నుంచి 12వ తరగతి దాకా చదువుకునేందుకు మంచి అవకాశం ఉంటుంది. ఇక్కడ చదువుతోపాటుగా గేమ్స్, సమగ్ర వికాసానికి కూడా ప్రాధాన్యత ఉంటుంది. ఒక్కోదాంట్లో గరిష్టంగా 80 మంది విద్యార్థుల వరకు ఆరో తరగతిలో అడ్మిషన్ ఉంటుంది.
ప్రవేశానికి గుర్తించిన 80 మంది విద్యార్థుల్లోనూ 75 శాతం గ్రామీణ, 25 శాతం పట్టణ ప్రాంత విద్యార్థులకు కేటాయిస్తారు. ఇందులో 15 శాతం ఎస్సీ, 7.5 శాతం ఎస్టీ, 3 శాతం దివ్యాంగులకు, బాలికలకు 1/3 వంతు రిజర్వేషన్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉంటుంది.