కాకినాడ జిల్లా పిఠాపురం పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు, రైఫిల్ షూటింగ్ కోచ్ షేక్ సాధిక్ ఖాన్ విచారణలో సంచలన విషయాలను బయటపెట్టాడు. నూకరాజు అల్లుడు జగదీశ్వరరెడ్డిని తానే పక్కా పథకం ప్రకారం విషం ఇచ్చి హత్య చేశానని పోలీసుల ముందు అంగీకరించాడు.

కోర్టు అనుమతితో సాధిక్ ఖాన్ను సర్పవరం పోలీసులు మూడు రోజుల కస్టడీలోకి తీసుకుని తీవ్రంగా విచారించారు. విచారణ ప్రారంభంలో తొలి రెండు రోజులు తనకు ఏమీ తెలియదని సాధిక్ తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. అయితే పోలీసులు సాంకేతిక ఆధారాలతో పాటు అతనికి సైనైడ్ విక్రయించిన వ్యక్తుల నుంచి సేకరించిన సాక్ష్యాలను నిందితుడి ముందు ఉంచడంతో అతడు తప్పు ఒప్పుకోక తప్పలేదు.
నిందితుడి వాంగ్మూలంపోలీసు విచారణలో సాధిక్ ఖాన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. జగదీశ్వరరెడ్డిని ఎలాగైనా అంతమొందించాలనే ఉద్దేశంతో మొదట ఓసారి కొబ్బరి నీళ్లలో విషపదార్థాన్ని కలిపి ఇచ్చాడు.అనారోగ్యంతో కాకినాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కూడా సుమారు 3 నుంచి 4 సార్లు విషాన్ని అందించాడు. దీంతో ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించి చనిపోతాడని భావించాడు.
కాకినాడ నుంచి హైదరాబాద్ ఆస్పత్రికి తరలించగా జగదీశ్వరరెడ్డి కొద్దిగా కోలుకుని ఇంటికి వచ్చారు. అయితే సాధిక్ ఖాన్ మళ్లీ సైనైడ్ పంపించడంతో, దానిని ఉపయోగించిన మరుసటి రోజే జగదీశ్వరరెడ్డి ప్రాణాలు కోల్పోయాడు. జగదీశ్వరరెడ్డి మరణం తర్వాత ఆయన భార్య సౌజన్యను వివాహం చేసుకుంటే.. వారి కుటుంబానికి చెందిన దాదాపు రూ. 25 కోట్ల ఆస్తి తన వశమవుతుందని సాధిక్ ఆశపడ్డాడు.
అయితే సౌజన్య తండ్రి (ఏఈ నూకరాజు) దీనికి ఏమాత్రం అస్సలు ఒప్పుకోలేదు. ఆస్తి మొత్తాన్ని మనవడు రియాన్ష్ కార్తికేయ పేరిట లేదా కుటుంబంలోని మరొకరి పేరిట రాస్తామని తెగేసి చెప్పారు. ఈ పరిణామంతో ఆగ్రహించిన సాధిక్ "ఆస్తి కోసమే నేను ఇదంతా చేశాను, ఇప్పుడు మీరు ఇలా చేస్తే ఊరుకోను" అంటూ నూకరాజు కుటుంబాన్ని తీవ్రంగా బెదిరించి గొడవపడ్డాడు. అందరినీ చంపేస్తానని హెచ్చరించినట్లు ఒప్పుకున్నాడు సాధిక్.
{{/usCountry}}అయితే సౌజన్య తండ్రి (ఏఈ నూకరాజు) దీనికి ఏమాత్రం అస్సలు ఒప్పుకోలేదు. ఆస్తి మొత్తాన్ని మనవడు రియాన్ష్ కార్తికేయ పేరిట లేదా కుటుంబంలోని మరొకరి పేరిట రాస్తామని తెగేసి చెప్పారు. ఈ పరిణామంతో ఆగ్రహించిన సాధిక్ "ఆస్తి కోసమే నేను ఇదంతా చేశాను, ఇప్పుడు మీరు ఇలా చేస్తే ఊరుకోను" అంటూ నూకరాజు కుటుంబాన్ని తీవ్రంగా బెదిరించి గొడవపడ్డాడు. అందరినీ చంపేస్తానని హెచ్చరించినట్లు ఒప్పుకున్నాడు సాధిక్.
{{/usCountry}}దీంతో ఏఈ నూకరాజు ఫ్యామిలీ భయంతో రాజమండ్రి గోదావరి వారధి పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటారని తాను ఊహించలేదని విచారణలో తెలిపాడు. నిందితుడు సాధిక్ ఖాన్ ఉపయోగించిన విష పదార్థ నమూనాలను పోలీసులు సీజ్ చేశారు. ఈ ఆత్మహత్యల వెనక ఉన్న బ్లాక్మెయిలింగ్, వేధింపులపై పోలీసులు పూర్తి స్థాయి ఛార్జ్షీట్ సిద్ధం చేస్తున్నారు.