ఆంధ్రప్రదేశ్లో భూ హక్కుల పరిరక్షణ, వివాదాల పరిష్కారం దిశగా కూటమి ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. నిషేధిత ఆస్తుల జాబితా (22A) నిర్వహణలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ నూతన జీఓని విడుదల చేయనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఇప్పటివరకు తమ భూమి ప్రభుత్వానిది కాదని నిరూపించుకోవడానికి సామాన్య పౌరులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇకపై ఈ నిబంధనను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. తన భూమి పట్టా భూమి అని పౌరుడు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఆ బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుంది. ఏ అధికారి అయినా నిర్లక్ష్యంగా వ్యవహరించి భూ యజమాని హక్కులకు భంగం కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు.
జూన్ 18, 1954 కంటే ముందు కేటాయించిన భూములను పూర్తిగా 22A నిషేధిత జాబితా నుండి తొలగిస్తున్నారు. భూముల రికార్డుల్లో అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు వెబ్ల్యాండ్ 2.0 వ్యవస్థను ప్రామాణికంగా తీసుకోనున్నారు. ఇందులో ఎటువంటి మాన్యువల్ ఎంట్రీలకు (చేతిరాతల మార్పులకు) అవకాశం ఉండదు.
నిషేధిత జాబితా పర్యవేక్షణ ఇకపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ పరిధిలోనే ఉంటుంది. గ్రామ కంఠం, ప్రైవేట్ పట్టా భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ 22A లో చేర్చకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఏ భూమినైనా 22A లో చేర్చాలనుకుంటే ప్రజలు ఆ వివరాలు తెలుసుకునేలా పారదర్శకమైన రిజిస్టర్ను అందుబాటులో ఉంచుతారు.
ఏదైనా భూమి అన్యాక్రాంతమవుతోందని అత్యవసరంగా 22A లో చేర్చాలంటే.. సంబంధిత యజమానికి 30 రోజుల వ్యవధితో నోటీసు ఇచ్చి, మొత్తం ప్రక్రియను 60 రోజుల్లోగా పూర్తి చేయాలి. లేని పక్షంలో ఆ భూమి సాధారణ పట్టా భూమిగానే చెల్లుబాటు అవుతుంది. నూతన మార్గదర్శకాల ప్రకారం సాఫ్ట్వేర్ మార్పులను సీసీఎల్ఏ, ఐజీఆర్ఎస్ అధికారులు 90 రోజుల్లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం కాలపరిమితి విధించింది. తన భూమి ప్రభుత్వ భూమి కాదని నిరుపించుకోవాల్సిన బాధ్యత పౌరులు, భూ యజమానులపై ఉండదు. ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుంది.
{{/usCountry}}ఏదైనా భూమి అన్యాక్రాంతమవుతోందని అత్యవసరంగా 22A లో చేర్చాలంటే.. సంబంధిత యజమానికి 30 రోజుల వ్యవధితో నోటీసు ఇచ్చి, మొత్తం ప్రక్రియను 60 రోజుల్లోగా పూర్తి చేయాలి. లేని పక్షంలో ఆ భూమి సాధారణ పట్టా భూమిగానే చెల్లుబాటు అవుతుంది. నూతన మార్గదర్శకాల ప్రకారం సాఫ్ట్వేర్ మార్పులను సీసీఎల్ఏ, ఐజీఆర్ఎస్ అధికారులు 90 రోజుల్లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం కాలపరిమితి విధించింది. తన భూమి ప్రభుత్వ భూమి కాదని నిరుపించుకోవాల్సిన బాధ్యత పౌరులు, భూ యజమానులపై ఉండదు. ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుంది.
{{/usCountry}}