22ఏ భూముల బాధితులకు కోసం తిరుపతిలో ఆస్తి హక్కుల కేంద్రం
తిరుపతిలో మెుట్టమెుదటి ఆస్తి హక్కుల కేంద్రం ఏర్పాటైంది. ఇది 22ఏ భూముల బాధితుల కోసం పని చేయనుంది.
సెంటర్ ఫర్ లిబర్టీ సంస్థ తిరుపతిలో రాష్ట్రంలోనే మొట్టమొదటి ఆస్తి హక్కు కార్యాలయాన్ని ప్రారంభించింది. 22ఏ జాబితా సమస్యతో ఇబ్బంది పడుతున్న బాధితులకు అండగా నిలిచి, వారితో సమన్వయం చేసుకుంటూ పనిచేయడం దీని ముఖ్య ఉద్దేశ్యం.

'కఠినమైన 22A జాబితాలో తమ భూములు చేర్చటం వల్ల చట్టబద్ధంగా పొందిన ఆస్తులను వినియోగించుకోలేక రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది భూ యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారి తరఫున ఈ సంస్థ పోరాడుతుంది,' అని సంస్థ చైర్మన్, మాజీ పోలీస్ అధికారి ఏ.బి. వెంకటేశ్వరరావు ప్రకటించారు. తిరుపతిలోని అన్నమయ్య రోడ్డులో ఈ కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. తమ భూములను 22A జాబితా నుండి విడిపించుకోవడానికి భూ యజమానులు ప్రభుత్వంపై యుద్ధం చేయాల్సిందేనా అని ప్రశ్నించారు. 2010లోనే ఈ భూములను ఆ జాబితాలో చేర్చారని, ఇప్పటికీ అసలైన యజమానులు వాటిని వినియోగించుకోలేని పరిస్థితిలో ఉన్నారని పేర్కొన్నారు.
రైతులు, పేదల భూములను ప్రభుత్వాలు 22ఏ పేరిట నిషేధిత జాబితాలో ఉంచాయని ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. ఎప్పటినుంచో తరతరాలుగా వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు హక్కులు కల్పించారని పేర్కొన్నారు. 1971 నుంచి పాసుపుస్తకాలు, అడంగళ్లు, 1బీలు వచ్చాయన్నారు. 'వాటిని బ్యాంకుల్లో పెట్టి రైతులు అప్పులు తెచ్చుకున్నారు, కట్నాలుగా ఇచ్చారు. పిల్లలకు రాసిచ్చారు. ఇలాంటివి ప్రభుత్వ భూములుగా చూపించి.. 22ఏ నిషేధిత జాబితాలో ఉంచడం సరైనది కాదు. నోటీసులు ఇవ్వకుండా, ఎవరికీ తెలియకుండా.. నిషేధిక జాబితాలో ఉంచిన వాటిని తిరిగి వారికి చెందేలా చూడాలి.' అని ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు.
ఇదే సమయంలో కేంద్ర కన్వీనర్ నల్లమోతు చక్రవర్తి దీనిని ప్రభుత్వం సృష్టించిన ఒక తీవ్రమైన సంక్షోభంగా అభివర్ణించారు. దీనివల్ల ప్రజలు తమ కష్టార్జితంతో కొనుగోలు చేసిన భూములను విక్రయించుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ క్లిష్ట పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకుని ప్రజలను దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని రాజకీయ నాయకులు, రెవెన్యూ అధికారుల తీరును కూడా ఆయన తప్పుబట్టారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


