ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకునే భక్తులకు, తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం ఒక భారీ ఊరటనిచ్చే ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను అనుసంధానిస్తూ నల్లమల అడవుల మీదుగా సరికొత్త నాలుగు వరుసల (4 Lane) ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆధ్యాత్మిక పర్యాటక రంగానికి బూస్ట్ ఇచ్చేలా ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారు.

నేషనల్ హైవే 765 పరిధిలో నిర్మించనున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అంచనా వ్యయం దాదాపు రూ.12,000 కోట్లు. ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లా డోర్నాల నుండి తెలంగాణలోని బ్రాహ్మణపల్లి వరకు మొత్తం 86.74 కిలోమీటర్ల పొడవునా ఈ ఎలివేటెడ్ కారిడార్ (ఫ్లైఓవర్ తరహా వంతెన రహదారి) నిర్మించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ పరిధి: పెద్దరావీడు నుండి శ్రీశైలం వరకు – 41.39 కిలోమీటర్లు
తెలంగాణ పరిధి: బ్రాహ్మణపల్లి నుండి శ్రీశైలం వరకు – 45.35 కిలోమీటర్లు
నల్లమల అభయారణ్యం గుండా వెళ్లే ప్రస్తుత ఘాట్ రోడ్డు కారణంగా వన్యప్రాణులకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. రాత్రి వేళల్లో రాకపోకలపై ఆంక్షలు కూడా అమల్లో ఉన్నాయి. ఈ నూతన ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం వల్ల ప్రయోజనాలు కలుగుతాయని అధికారులు వెల్లడించారు.
అడవికి పైనుండి ఈ కారిడార్ వెళ్తుంది కాబట్టి, సున్నితమైన అటవీ ప్రాంతాలలో మానవ జోక్యం, వాహనాల కాలుష్యం తగ్గి వన్యప్రాణులకు రక్షణ దొరుకుతుంది. పండగలు, సెలవు దినాల్లో శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఏర్పడే భారీ ట్రాఫిక్ జామ్లకు ఇది శాశ్వత పరిష్కారం చూపుతుంది. ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది.
మార్కాపురంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. ఈ హైవే ప్రాజెక్టు పర్యావరణ పరిరక్షణను, ప్రాంతీయ అభివృద్ధిని సమతుల్యం చేసే ఒక మైలురాయి వంటిదని కొనియాడారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్, క్షేత్రస్థాయి ప్రణాళికల రూపకల్పన వేగంగా జరుగుతోందని ఆయన తెలిపారు.
{{/usCountry}}మార్కాపురంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. ఈ హైవే ప్రాజెక్టు పర్యావరణ పరిరక్షణను, ప్రాంతీయ అభివృద్ధిని సమతుల్యం చేసే ఒక మైలురాయి వంటిదని కొనియాడారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్, క్షేత్రస్థాయి ప్రణాళికల రూపకల్పన వేగంగా జరుగుతోందని ఆయన తెలిపారు.
{{/usCountry}}ఈ నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్ అందుబాటులోకి వస్తే శ్రీశైలం క్షేత్రానికి చేరుకోవడం సులభతరం అవ్వడమే కాకుండా, పరిసర ప్రాంతాలలో ఆర్థిక వృద్ధి, పర్యాటక రంగం మరింత బలోపేతం కానున్నాయి.