రాయలసీమ వ్యాప్తంగా జనావాసాల్లోకి చిరుతల చొరబాట్లు పెరగడం కనిపిస్తోంది. పులులకు తీవ్రమైన నీటి కొరత, ఆవాసాలు తగ్గిపోవడం, పెరుగుతున్న పర్యావరణ ఒత్తిడే ఈ ధోరణికి కారణమని అటవీ అధికారులు పేర్కొంటున్నారు. తక్షణమే సరిదిద్దే చర్యలు తీసుకోకపోతే.. ఈ ప్రాంతంలో మానవ-వన్యప్రాణుల సంఘర్షణ తీవ్రంగా పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

వైఎస్ఆర్ కడప జిల్లా దువ్వూరు మండలం చిన్న బకరపురం గ్రామంలో ఇటీవల జరిగిన ఓ ఘటన జరిగింది. గ్రామంలోకి ప్రవేశించిన చిరుత పిల్లను వీధి కుక్కలు చంపడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అటవీ అధికారుల సమాచారం ప్రకారం, రాయలసీమలో గత మూడేళ్లలో మానవ నివాస ప్రాంతాల్లోకి ప్రవేశించిన 30కి పైగా చిరుతలు మరణించాయి. ఆందోళనకరంగా, గత సంవత్సరంలోనే 16 మరణాలు నమోదయ్యాయి.
చిరుతపులులు మేకలు, గొర్రెలు, దూడలు, ఆవులు వంటి జంతువులను ఇష్టపడతాయి. ఆహారం కోసం అవి మానవ నివాస ప్రాంతాల్లోకి ప్రవేశిస్తాయి. కొన్నిసార్లు, అటవీ ప్రాంతాల్లో సమీపంలో నీటి వనరులు లేకపోవడం కూడా ఒక కారణంగా ఉంది. చిరుతపులులు దట్టమైన అడవుల్లో లోపల ఉండటానికి బదులుగా, కొద్దిగా బహిరంగ లేదా మైదాన ప్రాంతాల్లోకి వెళ్లడానికి ఇష్టపడతాయని అటవీ అధికారులు అంటున్నారు.
చిరుతపులులు మనుషులపై దాడి చేయడానికి బయటకు రావడం లేదు. కానీ ఆకస్మాత్తుగా మనిషి ఎదురైతే దాని రక్షణలో భాగంగా దాడి చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. వాటి సంచారం ప్రధానంగా ఆహారం, నీటి అన్వేషణ కోసమే ఉంటుంది. అడవుల అంచున ఉన్న గ్రామాల్లోకి చిరుతలు ఎక్కువగా వస్తుంటాయి.
వేటగాళ్లు ఏర్పాటు చేసిన ఉచ్చులు, అడవి పందులను నివారించడానికి రైతులు ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెలు పులులకు ఇబ్బందికరంగా మారాయి. విద్యుత్ కంచెల కారణంగా ప్రమాదవశాత్తు మరణాలు పెరుగుతున్నాయి. రైతులలో తక్షణమే అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.
{{/usCountry}}వేటగాళ్లు ఏర్పాటు చేసిన ఉచ్చులు, అడవి పందులను నివారించడానికి రైతులు ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెలు పులులకు ఇబ్బందికరంగా మారాయి. విద్యుత్ కంచెల కారణంగా ప్రమాదవశాత్తు మరణాలు పెరుగుతున్నాయి. రైతులలో తక్షణమే అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.
{{/usCountry}}అటవీ భూముల ఆక్రమణలతో పులుల సహజ ఆవాసాలను తగ్గిపోయేలా చేస్తూ, వన్యప్రాణులను మానవ నివాసాలకు మరింత దగ్గరగా నెడుతున్నాయి. దట్టమైన అడవుల్లో ఉండాల్సిన వన్యప్రాణులు ఇప్పుడు జనావాస ప్రాంతాల వైపు వస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో చిరుతపులుల సంచారం ఎక్కువగా ఉందని, ఇది తమ జీవనోపాధికి ముప్పుగా మారిందని రైతులు వాపోతున్నారు.
కొన్నిసార్లు పొలాల దగ్గర చిరుతపులులు సంచారం ఉన్నట్టుగా రైతులు చూస్తున్నారు. దానికి సంబంధించిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. పశువులను, మేకలను మేతకు బయటకు తీసుకెళ్లాలంటే భయపడుతున్నాయి.