మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతదేహం చత్తీస్ఘడ్లోని ఆయన స్వగ్రామం అయిన పూవర్తికి చేరుకుంది. హిడ్మా తల్లి మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు మృతదేహం వద్దకు భారీగా చేరుకున్నారు. ఓ వ్యానులో నుంచి మృతదేహాన్ని కిందకు దించారు. స్థానికులు మృతదేహానికి ముట్టుకుని మెుక్కుతున్నట్టుగా ఓ వీడియోలో కనిపించింది.

పూవర్తి గ్రామం మెుత్తం హిడ్మా ఇంటి దగ్గరకే చేరుకుంది. మహిళలంతా బోరున విలపిస్తున్నారు. లోంగిపో అని చెప్పాం కదా బాబు అంటూ ఏడుస్తున్నారు.
మంగళవారం అల్లూరి సీతారామరాజు జిల్లా మరేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో ఆరుగురు మృతి చెందారు. హిడ్మాతోపాటుగా ఆయన భార్య రాజే కూడా చనిపోయారు. పోస్టుమార్టం ప్రక్రియలో కాస్త జాప్యం జరిగింది. మంగళవారం ఉదయం చనిపోగా.. బుధవారం రాత్రి వరకు హిడ్మా మృతదేహానికి రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం చేశారు.
హిడ్మా ఉన్నాడనే ధైర్యంతో పూవర్తి గ్రామం మావోయిస్టు పార్టీకి రాజధానిలా ఉండేదని పలువురు చెబుతున్నారు. కానీ ఇప్పుడు హిడ్మా ఎన్కౌంటర్తో పార్టీకి కోలుకోలేని దెబ్బ పడింది. 1981లో సుక్మాలో పూవర్తి గ్రామంలో జన్మించిన హిడ్మా, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్కు నాయకత్వం వహించారు. సీపీఐ మావోయిస్టు సెంట్రల్ కమిటీలో అతి పిన్న వయస్కుడైన సభ్యుడయ్యారు. బస్తర్ ప్రాంతం నుండి కేంద్ర కమిటీలో ఉన్న ఏకైక గిరిజన సభ్యుడు ఆయన. మురియా తెగకు చెందిన హిడ్మాకు హిందీ, తెలుగు, గోండి, బెంగాలీ, కోయ భాషతోపాటుగా మరికొన్నింటిలో ప్రావీణ్యం ఉంది.
దండకారణ్యంలో హిడ్మాకు చాలా పట్టు ఉంది. పార్టీ శ్రేణులను ముందు ఉండి నడిపించేవారు. హిడ్మా ప్లాన్ వేస్తే పక్కాగా జరుగుతుందనే పేరు ఉంది. గెరిల్లా దాడులు చేయడంలో దిట్ట. భారీ దాడులకు వ్యూహం వేయాలంటే హిడ్మా అక్కడ ఉండేవాట. ఈ క్రమంలోనే మిలటరీ దాడులకు మారు పేరైన పీఎల్జీఏలో ఒకటో బెటాలియన్కు హిడ్మా సారథ్యం వహించారు.
{{/usCountry}}దండకారణ్యంలో హిడ్మాకు చాలా పట్టు ఉంది. పార్టీ శ్రేణులను ముందు ఉండి నడిపించేవారు. హిడ్మా ప్లాన్ వేస్తే పక్కాగా జరుగుతుందనే పేరు ఉంది. గెరిల్లా దాడులు చేయడంలో దిట్ట. భారీ దాడులకు వ్యూహం వేయాలంటే హిడ్మా అక్కడ ఉండేవాట. ఈ క్రమంలోనే మిలటరీ దాడులకు మారు పేరైన పీఎల్జీఏలో ఒకటో బెటాలియన్కు హిడ్మా సారథ్యం వహించారు.
{{/usCountry}}ఏడో తరగతి వరకే హిడ్మా చదువుకున్నారు. 17 ఏళ్ల వయసులో మావోయిస్టు పార్టీలో చేరారు. మావోయిస్టు పార్టీ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(పీఎల్జీఏ) 1వ బెటాలియన్కు కమాండర్గా, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో సభ్యుడిలాంటి కీలక బాధ్యతలు హిడ్మా చేతిలో ఉండేవి. మావోయిస్టుల టాక్టికల్ కౌంటర్ అఫెన్సివ్ క్యాంపెయిన్ కూడా హిడ్మా నేతృత్వంలోనే దాడులు చేసేది. ఇప్పుడు హిడ్మా మరణంతో పూవర్తి గ్రామంతోపాటుగా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా విషాదఛాయలు అలుముకున్నాయి.