...
...
Next Story

MBBS counselling : ఎంబీబీఎస్ ప్రవేశాల కోసం KNRUHS మొదటి విడత వెబ్ ఆప్షన్లు

MBBS counselling : తెలంగాణలోని వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం వెబ్ ఆప్షన్స్ ప్రకటించింది. విద్యార్థులు ప్రవేశాల కోసం ఈ ప్రక్రియ పూర్తి చేయాలి.

Updated on: Aug 29, 2026, 05:48:25 IST
Advertisement

కాళోజీ నారాయణ రావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్(KNRUHS) 2026-27 విద్యా సంవత్సరానికి గాను కాంపిటెంట్ అథారిటీ కోటా కింద ఎంబీబీఎస్ ప్రవేశాల కోసం వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ మొదటి దశను శుక్రవారం ప్రారంభమైంది. నోటిఫికేషన్ ప్రకారం.. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 29న ఉదయం 6 గంటల నుండి సెప్టెంబర్ 1న మధ్యాహ్నం వరకు అధికారిక కౌన్సెలింగ్ పోర్టల్ ద్వారా తమ వెబ్ ఆప్షన్లను వినియోగించుకోవచ్చు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఈ కౌన్సెలింగ్ KNRUHSకు అనుబంధంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ మైనారిటీ, నాన్-మైనారిటీ వైద్య కళాశాలల్లోని కాంపిటెంట్ అథారిటీ కోటా కింద ఉన్న ఎంబీబీఎస్ సీట్లకు వర్తిస్తుంది. ఈ ప్రక్రియలో ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, పీఎంసీ, సీఏపీ, SCCL వర్గాల అభ్యర్థులు కూడా ఉంటారు.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సమయంలో తమ సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేసి సంబంధిత శాఖలతో తాత్కాలికంగా ధృవీకరించిన, ఆగస్టు 28న KNRUHS వెబ్‌సైట్‌లో ప్రచురించిన యూజీ వైద్య ప్రవేశాల తుది మెరిట్ జాబితాలో పేర్లు ఉన్న అభ్యర్థులు వెబ్ ఆప్షన్లను వినియోగించుకోవడానికి అర్హులు.

మొదటి దశలో వెబ్ ఆప్షన్లను వినియోగించుకోని వారికి తదుపరి కౌన్సెలింగ్ దశలలో ఆప్షన్లను వినియోగించుకోవడానికి అనుమతి ఉండదని KNRUHS అభ్యర్థులను హెచ్చరించింది. అదేవిధంగా తమ ఆప్షన్స్ ప్రకారం సీటు కేటాయించబడినప్పటికీ, కేటాయించిన కళాశాలలో చేరని అభ్యర్థులు తదుపరి రౌండ్లలో పాల్గొనడానికి అర్హులు కారు.

కేటాయించిన వైద్య కళాశాలలో అసలు ధృవపత్రాల తుది ధృవీకరణ జరుగుతుందని కూడా KNRUHS పేర్కొంది. ధృవీకరణ సమయంలో ఏదైనా తప్పులు కనిపిస్తే.. తాత్కాలిక కేటాయింపు రద్దుకు, విశ్వవిద్యాలయ నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు ఉంటాయి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe