Andhra Pradesh Handicrafts : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాను ఇచ్చిన మాటను 24 గంటలు గడవక ముందే ఆచరణలో పెట్టి తన ప్రత్యేకతను చాటుకున్నారు. రాష్ట్ర హస్తకళా మహోత్సవం ప్రారంభోత్సవ వేడుకల్లో భాగంగా హస్తకళాకారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ మేరకు హస్త కళాకారుల ఆరోగ్యానికి పూర్తి భరోసా కల్పించేలా క్లస్టర్ల వారీగా వైద్య శిబిరాలను తక్షణమే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. పవన్ కళ్యాణ్ చొరవతో బుధవారం నుంచే క్షేత్రస్థాయిలో ప్రత్యేక ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటయ్యాయి.
ప్రత్యేక వైద్య శిబిరాలు….
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం లేస్ కళాకారులు, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి కలంకారీ కళాకారుల కోసం మొదటి విడతగా ఈ ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహించారు. నరసాపురంలో నిర్వహించిన శిబిరంలో మొత్తం 105 మంది లేస్ కళాకారులకు నిపుణులైన వైద్యులు పరీక్షలు చేశారు. వీరిలో 37 మంది వివిధ రకాల కంటి సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆ 37 మందిలో 16 మందికి కళ్లలో శుక్లాలు (క్యాటరాక్ట్) ఉన్నట్లు గుర్తించారు.
వీరందరికీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో ఉచితంగా శస్త్ర చికిత్సలు చేయించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే చిన్నపాటి దృష్టి దోష సమస్యలతో ఇబ్బంది పడుతున్న మిగిలిన 21 మంది కళాకారులకు తగిన కళ్లజోళ్లను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నారు.
మరోవైపు ఆధ్యాత్మిక పట్టణమైన శ్రీకాళహస్తిలో 53 మంది కలంకారీ హస్తకళాకారులకి వైద్య పరీక్షలు నిర్వహించారు. కంటి పరీక్షలతో పాటు జనరల్ చెకప్, బీపీ, షుగర్ వంటి అన్ని రకాల ప్రాథమిక ఆరోగ్య పరీక్షలను ఈ శిబిరంలో ఉచితంగా చేశారు.
మంగళవారం జరిగిన హస్తకళా మహోత్సవం సందర్భంగా నరసాపురం నియోజకవర్గం పసలదీవి గ్రామానికి చెందిన లేస్ కళాకారిణి శ్రీమతి మహాలక్ష్మి తనకున్న కంటి సమస్యల గురించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. చీకటి పడితే కళ్లు సరిగ్గా కనిపించడం లేదని ఆమె తన బాధను వివరించారు.
{{/usCountry}}మంగళవారం జరిగిన హస్తకళా మహోత్సవం సందర్భంగా నరసాపురం నియోజకవర్గం పసలదీవి గ్రామానికి చెందిన లేస్ కళాకారిణి శ్రీమతి మహాలక్ష్మి తనకున్న కంటి సమస్యల గురించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. చీకటి పడితే కళ్లు సరిగ్గా కనిపించడం లేదని ఆమె తన బాధను వివరించారు.
{{/usCountry}}దీనిపై తక్షణమే స్పందించిన పవన్ కళ్యాణ్….. బుధవారం ఉదయమే మహాలక్ష్మితో పాటు అందే లక్ష్మి అనే మరో లేస్ కళాకారిణిని ప్రత్యేక వాహనంలో పెదకాకానిలోని ప్రసిద్ధ శంకర కంటి ఆసుపత్రికి పంపించారు. అక్కడ నిపుణులైన వైద్యులు వీరిద్దరికీ అత్యాధునిక పరికరాలతో కూడిన ప్రత్యేక పరీక్షలు నిర్వహించారు.
ఇరువురికీ దృష్టి దోష సమస్యలు ఉన్నట్లు నిర్ధారించిన వైద్యులు, వారికి అవసరమైన కళ్లజోళ్లు, ఐ డ్రాప్స్, మందులను ఉచితంగా అందజేసి సురక్షితంగా ఇంటికి పంపించారు. తమ సమస్యపై స్పందించి 24 గంటల్లోనే వైద్యం చేయించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు కళాకారులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.