రూ.500 కోట్ల సాస్కి నిధులతో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలలకు శాశ్వత భవనాలు నిర్మించాలని నిర్ణయించామని మంత్రి ఎస్.సవిత తెలిపారు. బీసీ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, మరమ్మతులకు నిధులు కేటాయించామని తెలిపారు. వర్షా కాల అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసనసభలో ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సవిత సమాధానాలిచ్చారు.

నాణ్యమైన విద్యను అందిస్తున్న బీసీ గురుకులాలకు విపరీతమైన డిమాండ్ ఉందన్నారు మంత్రి సవిత. రూ.500 కోట్ల సాస్కి నిధులతో ఎంజేపీ బీసీ గురుకులాల భవనాలు నిర్మించాలని నిర్ణయించామన్నారు. ఈ ఏడాది కొత్తగా 10 బీసీ గురుకులాలు స్థాపించామని, వాటిలో 5 రాయలసీమలో, మరో 5 ఉత్తరాంధ్రలో నెలకొల్పామని తెలిపారు. ఆరు బీసీ బాలికల గురుకులాలను జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేశామన్నారు. బీసీ బాలికల డ్రాపౌట్ల నివారణకు జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేశామన్నారు.
50 మంది విద్యార్థుల కంటే తక్కువగా ఉన్న బీసీ హాస్టళ్లను గురుకులాల్లో విలీనం చేస్తున్నామన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరవాత ఏపీలో 32 బీసీ గురుకులాలు మాత్రం ఉన్నాయని, 2014-19 మధ్య 75 బీసీ గురుకులాలను సీఎం చంద్రబాబు ఏర్పాటు చేశారని మంత్రి సవిత గుర్తు చేశారు. వాటిలో 25 ఎంజేపీలకు శాశ్వత భవనాల కోసం రూ.40 కోట్లను ఆనాడు మంజూరుచేయగా, 70 నుంచి 80 శాతం మేర పనులు సైతం పూర్తయ్యాయని అన్నారు. తరవాత వచ్చిన ప్రభుత్వం బీసీ గురుకులాలను పట్టించుకోకుండా గాలి కొదిలేసిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అసంపూర్తి గా నిలిచిపోయిన భవనాలకు నిధులు మంజూరు చేసిందన్నారు.గోనబావి, మడకశిర, రొద్దం, పులివెందుల సహా పలు ప్రాంతాల్లో ఉన్న గురుకులాల పనులు పున:ప్రారంభించామని, త్వరలోనే వాటిని పూర్తి చేసి బీసీ బిడ్డలకు అంకితం చేస్తామని తెలిపారు.
బీసీ హాస్టళ్లలో 90,676 మంది విద్యార్థులు చదువుతున్నారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే హాస్టళ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి సవిత తెలిపారు. సీఎస్ఆర్, డిస్ట్రిక్ మినరల్ ఫండ్స్ ద్వారా హాస్టళ్ల మరమ్మతులు చేపట్టామన్నారు. పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్న హాస్టళ్లను వేరే భవనాల్లోకి షిఫ్ట్ చేశామన్నారు. హాస్టళ్లలో పారిశుధ్య నిర్వహణకు 1,291 మంది పారిశుధ్య సిబ్బందిని, 142 మంది కుక్, కమాటీలను నియమించామని తెలిపారు. 2026-27 బడ్జెట్ లో హాస్టళ్ల మరమ్మతులకు రూ.20 కోట్లు కేటాయించామన్నారు. 2019-24 మధ్య ఆనాటి ప్రభుత్వం హాస్టళ్ల కనీస మరమ్మతులకు, వసతులకు నిధులు కూడా కల్పించలేదని మంత్రి సవిత తెలిపారు.
{{/usCountry}}బీసీ హాస్టళ్లలో 90,676 మంది విద్యార్థులు చదువుతున్నారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే హాస్టళ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి సవిత తెలిపారు. సీఎస్ఆర్, డిస్ట్రిక్ మినరల్ ఫండ్స్ ద్వారా హాస్టళ్ల మరమ్మతులు చేపట్టామన్నారు. పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్న హాస్టళ్లను వేరే భవనాల్లోకి షిఫ్ట్ చేశామన్నారు. హాస్టళ్లలో పారిశుధ్య నిర్వహణకు 1,291 మంది పారిశుధ్య సిబ్బందిని, 142 మంది కుక్, కమాటీలను నియమించామని తెలిపారు. 2026-27 బడ్జెట్ లో హాస్టళ్ల మరమ్మతులకు రూ.20 కోట్లు కేటాయించామన్నారు. 2019-24 మధ్య ఆనాటి ప్రభుత్వం హాస్టళ్ల కనీస మరమ్మతులకు, వసతులకు నిధులు కూడా కల్పించలేదని మంత్రి సవిత తెలిపారు.
{{/usCountry}}రూ.9.75 కోట్లతో భీమిలి బీసీ గురుకుల పాఠశాలకు అదనపు భవనం నిర్మిస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. ఈ భవనానికి సంబంధించి అంచనాలు కూడా ఇప్పటికే రూపొందించామని, అనుమతులు రాగానే నిర్మాణం ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలో భీమిలి ఎంజేపీ సహా 70 నుంచి 80 శాతం మేర అసంపూర్తి గా నిలిచిపోయిన ఎంజేపీ భవనాల నిర్మాణాల పూర్తికి కూటమి ప్రభుత్వం రూ.80 కోట్లు కేటాయించిందన్నారు. ఆరు నెలల్లో ఈ ఎంజేపీ భవనాలను బీసీ బిడ్డలకు అంకితం చేస్తామని మంత్రి సవిత తెలిపారు.