ముద్ఖేడ్-మేడ్చల్-మహబూబ్నగర్-డోన్ రైల్వే లైన్ డబ్లింగ్ ప్రాజెక్టుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పరిధిలో భూసేకరణ, ప్రభుత్వ భూముల బదిలీ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివరించారు.

దేశవ్యాప్తంగా సాగుతున్న కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, జాతీయ పథకాల అమలుపై ప్రధాని మోదీ న్యూఢిల్లీ నుంచి నిర్వహించిన 'ప్రగతి' (PRAGATI) వీడియో కాన్ఫరెన్స్లో సీఎస్ సాయి ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పురోగతిని ఆయన ప్రధానమంత్రికి నివేదించారు.
డోన్-మహబూబ్నగర్ రైల్వే ప్రాజెక్ట్ కోసం ఆంధ్రప్రదేశ్లో మొత్తం 23.07 హెక్టార్ల ప్రైవేట్ భూమి అవసరమని సీఎస్ తెలిపారు. దీనికి సంబంధించిన సెక్షన్ 20(A) నోటిఫికేషన్ను 2025 సెప్టెంబర్ 25న జారీ చేసినట్లు పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్టు కోసం కర్నూలు జిల్లాలోని నాలుగు మండలాల్లోని 16 గ్రామాల్లో దాదాపు 18.21 హెక్టార్ల భూమి అవసరం కానుంది. రైల్వే అధికారుల సహకారంతో ఇప్పటికే 8 గ్రామాల్లో పెగ్ మార్కింగ్ పూర్తయిందని, మిగిలిన గ్రామాల్లో పనులు వేగంగా జరుగుతున్నాయని సీఎస్ చెప్పారు. మరో రెండు వారాల్లో సెక్షన్ 20(E) నోటిఫికేషన్ విడుదల చేస్తామని వెల్లడించారు. నంద్యాల జిల్లాలో అవసరమైన 4.86 హెక్టార్ల భూమికి సంబంధించి పెగ్ మార్కింగ్ పూర్తయిందని, సెక్షన్ 20(E) నోటిఫికేషన్ను కూడా ఇప్పటికే జారీ చేసినట్లు వివరించారు.
ఈ ప్రాజెక్ట్ కోసం 4.05 హెక్టార్ల ప్రభుత్వ భూమిని బదిలీ చేయాల్సి ఉందని సీఎస్ తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. రైల్వే అధికారుల నుంచి అధికారిక అభ్యర్థనలు అందిన వెంటనే జిల్లా కలెక్టర్లు ముందస్తుగా భూమిని స్వాధీనం చేస్తారని సీఎస్ స్పష్టం చేశారు.
ఈ 'ప్రగతి' సమీక్షా సమావేశంలో ప్రధాని మోదీ దేశంలోని పలు ఇతర కీలక ప్రాజెక్టుల పురోగతిని కూడా పరిశీలించారు. ఉత్తరప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల్లోని రైల్వే లైన్లు, కోల్కతా మెట్రో విస్తరణ పనులు, రాజస్థాన్ పునరుత్పాదక ఇంధన వ్యవస్థలకు అనుసంధానించబడిన విద్యుత్ సరఫరా ప్రాజెక్టులు, మహారాష్ట్రలోని వధావన్ పోర్ట్ కనెక్టివిటీ రోడ్ ప్రాజెక్ట్, భారత్మాల హైవే ప్రాజెక్టులు, స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ 2.0 అమలు తీరును ప్రధాని సమీక్షించారు.
{{/usCountry}}ఈ 'ప్రగతి' సమీక్షా సమావేశంలో ప్రధాని మోదీ దేశంలోని పలు ఇతర కీలక ప్రాజెక్టుల పురోగతిని కూడా పరిశీలించారు. ఉత్తరప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల్లోని రైల్వే లైన్లు, కోల్కతా మెట్రో విస్తరణ పనులు, రాజస్థాన్ పునరుత్పాదక ఇంధన వ్యవస్థలకు అనుసంధానించబడిన విద్యుత్ సరఫరా ప్రాజెక్టులు, మహారాష్ట్రలోని వధావన్ పోర్ట్ కనెక్టివిటీ రోడ్ ప్రాజెక్ట్, భారత్మాల హైవే ప్రాజెక్టులు, స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ 2.0 అమలు తీరును ప్రధాని సమీక్షించారు.
{{/usCountry}}ఈ వర్చువల్ సమావేశంలో కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి డాక్టర్ టి.వి.సోమనాథన్, రైల్వే బోర్డు ఛైర్మన్, సీఈఓ సతీష్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు న్యూఢిల్లీ నుంచి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ తరఫున రవాణా, రహదారులు, భవనాలు, రెవెన్యూ, పురపాలక పరిపాలన శాఖల సీనియర్ అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.