Srikakulam - Tirupati Humsafar Express Train : ఉత్తరాంధ్ర వాసులకు దక్షిణ మధ్య రైల్వే తీపి కబురు అందించింది. తిరుపతి - శ్రీకాకుళం రోడ్ - తిరుపతి మధ్య హంసఫర్ వీక్లీ ఎక్స్ప్రెస్ (రైలు నెంబర్ 17439 / 17440) పట్టాలెక్కనుంది. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు చొరవతో రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. రెగ్యులర్ గా ప్రయాణించే వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలును ఏప్రిల్ 13వ తేదీన ప్రారంభం కానుంది.
ఈ కొత్త రైలు అందుబాటులోకి రావడం వల్ల తిరుమల శ్రీవారిని దర్శించుకునే ఉత్తరాంధ్ర భక్తులతో పాటు… పలు పనుల నిమిత్తం ప్రయాణించే వారికి ఎంతో సౌకర్యవంతంగా మారనుంది.రెండు రైళ్లు మారాల్సిన ఇబ్బందులు లేకుండానే… ఇక నేరుగా తిరుపతికి చేరుకోవచ్చు.
ప్రయాణ తేదీలు - వివరాలు
- దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలోని వివరాల ప్రకారం… ఈ రైలు వారానికి ఒకసారి చొప్పున ప్రయాణిస్తుంది.
- శ్రీకాకుళం రోడ్ - తిరుపతి ఎక్స్ప్రెస్(ట్రైన్ నంబర్ 17440 ): ఈ రెగ్యులర్ సర్వీస్ ఏప్రిల్ 13, 2026 నుంచి ప్రారంభమవుతుంది.
- తిరుపతి - శ్రీకాకుళం రోడ్ ఎక్స్ప్రెస్(ట్రైన్ నంబర్ 17439 ): ఈ రెగ్యులర్ ట్రైన్ సర్వీస్ ఏప్రిల్ 19, 2026 నుంచి మొదలవుతుంది.
తిరుపతి నుంచి ఆదివారం సాయంత్రం 16.55 గంటలకు బయలుదేరే రైలు.. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీకాకుళం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో శ్రీకాకుళం రోడ్ స్టేషన్ నుంచి సోమవారం మధ్యాహ్నం 15.00 గంటలకు బయలుదేరి.. మంగళవారం ఉదయం 08.10 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.దీని వల్ల శ్రీకాకుళం ప్రయాణికులు ఇకపై విశాఖ వెళ్లి తిరుపతి రైలు ఎక్కాల్సిన అవసరం ఉండదు. నేరుగానే తిరుపతికి చేరుకోవచ్చు.
ఈ రైలులో థర్డ్ ఏసీ (3A), స్లీపర్ క్లాస్ (Sleeper Class) కోచ్లు మాత్రమే ఉంటాయి. మధ్యతరగతి ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా ఈ కోచ్ల విభజన జరిగింది. సుదీర్ఘ ప్రయాణం చేసే వారికి ఈ రైలు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
{{/usCountry}}ఈ రైలులో థర్డ్ ఏసీ (3A), స్లీపర్ క్లాస్ (Sleeper Class) కోచ్లు మాత్రమే ఉంటాయి. మధ్యతరగతి ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా ఈ కోచ్ల విభజన జరిగింది. సుదీర్ఘ ప్రయాణం చేసే వారికి ఈ రైలు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
{{/usCountry}}దీర్ఘకాలిక కోరిక నెరవేరింది - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
ఈ కొత్త సర్వీసుతో శ్రీకాకుళం ప్రజల దీర్ఘకాలిక కోరిక నెరవేరిందని శ్రీకాకుళం ఎంపీ, కేంద్రమంత్రి రాహ్మోన్ నాయుడు అన్నారు. "75 ఏళ్లలో జిల్లా చరిత్ర లో తొలిసారిగా శ్రీకాకుళం నుంచి తిరుపతికి నేరుగా రెగ్యులర్ రైలు సర్వీస్ ప్రారంభమవుతోంది. 17439/40 హంసఫర్ ఎక్స్ప్రెస్ ప్రతి ఆదివారం తిరుపతి నుండి, ప్రతి సోమవారం శ్రీకాకుళం నుండి నడుస్తూ భక్తులకు ఎంతో సౌకర్యాన్ని కలిగించనుంది. ఏప్రిల్ 13న శ్రీకాకుళం రోడ్ స్టేషన్ నుండి రైలును ప్రారంభించనున్నాము. ఈ రైలు సర్వీస్ ను మంజూరు చేసిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు” అని ఓ ప్రకటన విడుదల చేశారు.