ప్రసిద్ధ పుణ్యక్షేత్రం విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో భద్రతను పటిష్టం చేస్తూ, భక్తుల రద్దీని నియంత్రించేందుకు ఆలయ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులు దర్శనానికి వెళ్లే సమయంలో సెల్ ఫోన్లు తీసుకువెళ్లడంపై పూర్తి స్థాయి నిషేధం విధించింది. ఈ మేరకు ఆలయ ఈవో సీనా నాయక్ కీలక ప్రకటన విడుదల చేశారు.

దుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చే భక్తుల భద్రతను పెంపొందించడం, అలజడి లేకుండా ప్రశాంతమైన దర్శనం కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
ఆలయ ప్రధాన ప్రవేశ ద్వారంలో సరికొత్త సెక్యూరిటీ స్కానింగ్ గేట్ ఏర్పాటు చేశారు. హోం గార్డులు, ఏజైల్ సెక్యూరిటీ సిబ్బంది ఈ గేట్ వద్ద భక్తులను నిశితంగా తనిఖీ చేస్తారు. స్కానింగ్ పాయింట్ దాటి ఒక్క మొబైల్ ఫోన్ కూడా లోపలికి వెళ్లకుండా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. క్యూ లైన్లలోకి వెళ్లడానికి ముందే భక్తులు తమ మొబైల్ ఫోన్లను కేటాయించిన డిపాజిట్ కౌంటర్లలో భద్రపరుచుకోవాల్సి ఉంటుంది.
సెల్ ఫోన్లు డిపాజిట్ చేయడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి, భక్తులు తదనుగుణంగా తమ సమయాన్ని ప్లాన్ చేసుకోవాలని, భద్రతా సిబ్బందికి సహకరించాలని ఆలయ యంత్రాంగం కోరింది.
దర్శనం కోసం వచ్చే భక్తుల క్యూ లైన్లలో ఎలాంటి అడ్డంకులు, నెట్టివేతలు జరగకుండా ఉండేందుకు ఆలయ ప్రాంగణంలో పలు సర్వీస్ కౌంటర్లను వేరే ప్రాంతాలకు తరలించారు. దర్శనం టికెట్ కౌంటర్లు ప్రవేశ ద్వారం వద్ద రద్దీ తగ్గించేలా దూరంగా పునర్నిర్మించారు. ఉచిత లడ్డూ ప్రసాదం కౌంటర్లు దర్శనం పూర్తిచేసుకుని బయటకు వచ్చే మార్గంలో క్రమబద్ధీకరించారు.
ఈ నూతన మార్పుల వల్ల భక్తులు ఎలాంటి అవాంతరాలు లేకుండా నేరుగా అమ్మవారి దర్శన ప్రాంగణానికి వేగంగా చేరుకునే వెసులుబాటు కలిగింది. ఇంద్రకీలాద్రికి రోజురోజుకూ పెరుగుతున్న భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని ఈ భద్రతా చర్యలు చేపట్టారు అధికారులు. ఆలయ సిబ్బంది, సెక్యూరిటీ టీమ్ ఇచ్చే సూచనలను పాటిస్తూ, ప్రశాంతమైన వాతావరణంలో శ్రీ కనకదుర్గమ్మ వార్ల కృపాకటాక్షాలు పొందాలని ఆలయ యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.
{{/usCountry}}ఈ నూతన మార్పుల వల్ల భక్తులు ఎలాంటి అవాంతరాలు లేకుండా నేరుగా అమ్మవారి దర్శన ప్రాంగణానికి వేగంగా చేరుకునే వెసులుబాటు కలిగింది. ఇంద్రకీలాద్రికి రోజురోజుకూ పెరుగుతున్న భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని ఈ భద్రతా చర్యలు చేపట్టారు అధికారులు. ఆలయ సిబ్బంది, సెక్యూరిటీ టీమ్ ఇచ్చే సూచనలను పాటిస్తూ, ప్రశాంతమైన వాతావరణంలో శ్రీ కనకదుర్గమ్మ వార్ల కృపాకటాక్షాలు పొందాలని ఆలయ యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.
{{/usCountry}}