ఏపీ గ్రామీణ బ్యాంకులో ఉద్యోగ ఖాళీలు - కేవలం ఇంటర్వ్యూనే..!
ఏపీ గ్రామీణ బ్యాంక్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. పలు విభాగాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో 7 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు నవంబర్ 28వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. https://apgb.bank.in/ వెబ్ సైట్ లో వివరాలు చూడొచ్చు.
గుంటూరులోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ నుంచి ఉద్యోగ ప్రకటన జారీ అయింది. ఇందులో భాగంగా 7 ఫైనాన్షియల్ లిట్రసీ కౌన్సెలర్స్ ఖాళీలను భర్తీ చేస్తారు. కాంట్రాక్ట్ పద్ధతిలో వీటిని రిక్రూట్ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు నవంబర్ 28, 2025వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.

నోటిఫికేషన్ ముఖ్య వివరాలు:
- ఉద్యోగ ప్రకటన - ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్
- ఉద్యోగ ఖాళీలు - 07 (ఫైనాన్షియల్ లిట్రసీ కౌన్సెలర్స్)
- ఈ 7 పోస్టులను కూడా కాంట్రాక్ట్ పద్ధతిలోనే భర్తీ చేస్తారు. (ఒంగోలు, కడప, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం)
- పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు ఉండాలి.
తెలుగు, ఇంగ్లీష్ భాషలు వచ్చి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం కూడా ఉండాలి. - వయోపరిమితి 33 నుంచి 63 ఏళ్లు ఉండాలి.
- దరఖాస్తు విధానం - ఆఫ్ లైన్
- దరఖాస్తు చివరి తేదీ - 28 నవంబర్ 2025
- దరఖాస్తు ఫారమ్ ను జనరల్ మేనేజర్, హెడ్ ఆఫీస్, ఫోర్త్ ఫ్లోర్, 4/1 Brodiepet, గుంటూరు-522002 చిరునామాలో సమర్పించాలి.
- అప్లికేషన్ ఫీజు కింద రూ. 1000 చెల్లించాలి.
- ఎంపిక విధానం - అప్లికేషన్లను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూుకి పిలుస్తారు.గుంటూరులోని హెడ్ ఆఫీసులో వీటిని నిర్వహిస్తారు.
- ఎంపికైన వారికి నెలకు రూ.23,500 - రూ.30,000 మధ్య జీతం ఉంటుంది. (అలవెన్సులు కలిపి)
- ఏమైనా సందేహాలు ఉంటే fi@apgb.co.in మెయిల్ చేయవచ్చు.
- అప్లికేషన్ ఫారమ్ ను https://apgb.bank.in/notifications లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలి.
- అధికారిక వెబ్ సైట్ - https://apgb.bank.in/
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

