జాతీయ రహదారులపై తరచూ ప్రయాణించే స్థానిక వాహనదారులకు భారత జాతీయ రహదారుల సంస్థ(NHAI) డిజిటల్ విప్లవంతో సరికొత్త వెసులుబాటు కల్పించింది. టోల్ప్లాజాలకు సమీపంలో నివసించే ప్రజలు డిజిటల్ విధానంలో ఆన్లైన్ ద్వారానే ఫాస్టాగ్ లోకల్ పాస్(FASTag Local Pass) పొందే ప్రక్రియను అందుబాటులోకి తెచ్చింది. గతంలో లోకల్ పాస్ కావాలంటే స్థానిక వాహనదారులు నేరుగా టోల్ప్లాజాలకు వెళ్లి, పత్రాలు సమర్పించి నిరీక్షించాల్సి వచ్చేది.

కానీ ఇప్పుడు ఎలాంటి భౌతిక పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేకుండా, నేరుగా ఆన్లైన్ ద్వారానే నిమిషాల వ్యవధిలో పాస్ పొందే సౌకర్యాన్ని తీసుకొచ్చారు. ఢిల్లీ-అర్బన్ ఎక్స్టెన్షన్ హైవేలోని ముండ్కా-బక్కర్వాలా టోల్ప్లాజా వద్ద ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ విధానం విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా దాదాపు 130 కేంద్రాల్లో దీన్ని విస్తరించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్కు చెందిన 12 టోల్ప్లాజాలు కూడా ఉన్నాయి.
టోల్ప్లాజా నుంచి 20 కిలోమీటర్ల పరిధిలో నివాసముంటున్న స్థానికులకు మాత్రమే ఈ లోకల్ పాస్ వర్తిస్తుంది. కారు, జీపు వంటి వ్యక్తిగత (నాన్-కమర్షియల్) వాహనదారులకు మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. మీ ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్, మీ వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లో ఉన్న అడ్రస్ ఒకేలా ఉండాలి. రెండింటిలో తేడాలు ఉంటే సిస్టమ్ దరఖాస్తును తిరస్కరిస్తుంది.
ముందుగా NHAI అధికారిక రాజ్మార్గ్ యాత్ర మీ మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్లో లోకల్ పాస్ ఆప్షన్ను ఎంచుకుని, మీరు రోజువారీ ప్రయాణించే టోల్ప్లాజాను ఎంపిక చేసుకోవాలి. వాహన ఫాస్టాగ్ వివరాలు, మీ ఆధార్ సంఖ్య, వాహన ఆర్సీ వివరాలను అక్కడ నమోదు చేయాలి. ఈ యాప్ నేరుగా డిజిలాకర్, వాహన్ డేటాబేస్ల ఆధారంగా వివరాలను డిజిటల్గా ధృవీకరిస్తుంది. ఆ తర్వాత GIS (Geographic Information System) సాంకేతికత ద్వారా మీ నివాసం టోల్ప్లాజాకు 20 కి.మీ. పరిధిలోనే ఉందో లేదో సాఫ్ట్వేర్ తనిఖీ చేస్తుంది.
ప్రక్రియ పూర్తయ్యాక, నిర్ణీత రుసుము రూ.360ని ఆన్లైన్ ద్వారా చెల్లిస్తే లోకల్ పాస్ జనరేట్ అవుతుంది. పాస్ పొందిన వాహనదారులు ఒక నెల వ్యవధిలో సదరు టోల్ప్లాజా ద్వారా ఎన్నిసార్లైనా ప్రయాణించవచ్చు. మరుసటి నెలలో కూడా యాప్ ద్వారానే సులువుగా రెన్యూవల్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో అందుబాటులోకి వచ్చిన 12 టోల్ప్లాజాల్లో గొల్లప్రోలు మోపిదేవి, పెదగరువు (రాజమహేంద్రవరం), గంట్యాడ (విజయనగరం), బ్రాహ్మణపల్లి, చిట్టిమిట్టి చింతల, చోళసముద్రం, ఎర్రదొడ్డి, కొత్తపల్లి, అగనంపూడి(విశాఖపట్నం), పంచవటి, వెంకటపాలెం ఉన్నాయి.
{{/usCountry}}ప్రక్రియ పూర్తయ్యాక, నిర్ణీత రుసుము రూ.360ని ఆన్లైన్ ద్వారా చెల్లిస్తే లోకల్ పాస్ జనరేట్ అవుతుంది. పాస్ పొందిన వాహనదారులు ఒక నెల వ్యవధిలో సదరు టోల్ప్లాజా ద్వారా ఎన్నిసార్లైనా ప్రయాణించవచ్చు. మరుసటి నెలలో కూడా యాప్ ద్వారానే సులువుగా రెన్యూవల్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో అందుబాటులోకి వచ్చిన 12 టోల్ప్లాజాల్లో గొల్లప్రోలు మోపిదేవి, పెదగరువు (రాజమహేంద్రవరం), గంట్యాడ (విజయనగరం), బ్రాహ్మణపల్లి, చిట్టిమిట్టి చింతల, చోళసముద్రం, ఎర్రదొడ్డి, కొత్తపల్లి, అగనంపూడి(విశాఖపట్నం), పంచవటి, వెంకటపాలెం ఉన్నాయి.
{{/usCountry}}విశాఖపట్నం సమీపంలోని అగనంపూడి టోల్ప్లాజా వద్ద గత రెండేళ్లుగా ఏ వాహనం నుంచీ టోల్ రుసుము వసూలు చేయడం లేదు. అయినప్పటికీ ఎన్హెచ్ఏఐ తన అధికారిక వెబ్సైట్ జాబితాలో ఆన్లైన్ లోకల్ పాస్ పొందే ప్లాజాలలో అగనంపూడి పేరును కూడా నమోదు చేసింది.