...
...
Next Story

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ బిగ్ అప్‌డేట్.. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 17 కొత్త కోర్సులు!

డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 17 కోర్సులను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఈ వృత్తి కోర్సులు ఎంతగానో ఉపయోగపడనుంది.

Published on: Jul 21, 2026, 14:23:50 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం(NTRUHS) తీపి కబురు అందించింది. రాబోయే 2026-27 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సర్కారు మెడికల్ కాలేజీల్లో 17 నూతన అలైడ్, హెల్త్‌కేర్ ప్రొఫెషన్ కోర్సులను ప్రారంభించేందుకు విశ్వవిద్యాలయం సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ

నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్‌కేర్ ప్రొఫెషన్స్(NCAHP) ఆమోదించిన ఈ కోర్సుల పరిచయంపై వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి.చంద్రశేఖర్ అధ్యక్షతన కీలక సమీక్షా సమావేశం జరిగింది. అర్హులైన అధ్యాపకుల లభ్యత, మౌలిక వసతులు, నిబంధనల అమలుపై ఈ భేటీలో సమగ్రంగా చర్చించారు.

రేడియోగ్రఫీ, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, కార్డియోవాస్క్యులర్ టెక్నాలజీ, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ వంటి డిమాండ్ ఉన్న పారామెడికల్ విభాగాల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి. NCAHP నిర్దేశించిన నిబంధనలు, ప్రమాణాలకు అనుగుణంగా అర్హతల పరిశీలన పూర్తయ్యాకే ఈ కోర్సులకు అనుమతులు మంజూరు చేస్తారు.

వైద్య రంగంలో వైద్యులతో పాటు నైపుణ్యం కలిగిన అలైడ్ హెల్త్‌కేర్ సిబ్బందికి అంతర్జాతీయంగా భారీగా డిమాండ్ పెరిగింది. ఈ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు దేశ విదేశాల్లో తక్షణ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కొత్తగా అందుబాటులోకి వచ్చిన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో నాణ్యమైన వైద్య విద్యతో పాటు ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా వర్సిటీ అడుగులు వేస్తోంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అత్యున్నత స్థాయి పారామెడికల్ విద్యను అందుబాటు ధరల్లో అందించేందుకు ఈ నిర్ణయం దోహదపడనుంది. నిబంధనల ప్రకారం అన్ని సౌకర్యాలు పూర్తయిన తర్వాతే ఈ కొత్త విద్యా సంవత్సరంలో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమవుతుంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe