Tirumala Summer Rush 2026 : వేసవి కాలం సెలవులు కావడంతో కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రానికి భక్తుల రాక పోటెత్తింది. శ్రీవారి దర్శనార్థం దేశ విదేశాల నుంచి తరలివస్తున్న యాత్రికుల సంఖ్య రోజురోజుకు రికార్డు స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తిరుమలలో గురువారం నాడు ఊహించని విధంగా భక్తుల రద్దీ నెలకొంది. కొండపైకి వచ్చే సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) యంత్రాంగం అత్యంత ప్రతిష్టాత్మకంగా విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది క్యూలైన్లు, కంపార్ట్మెంట్లను రాత్రింబవళ్లు పర్యవేక్షిస్తున్నారు.

ముఖ్యంగా భానుడి భగభగలకు భక్తులు అల్లాడిపోకుండా ఉపశమనం కల్పించేందుకు టీటీడీ ప్రత్యేక చర్యలు తీసుకుంది. బాటగంగమ్మ సర్కిల్ నుంచి గోగర్భం డ్యామ్ సర్కిల్ మీదుగా ఔటర్ రింగ్ రోడ్ వరకు సుదీర్ఘమైన చలువ పందిళ్లను నిర్మించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, మ్యూజియం ప్రాంగణం, నారాయణగిరి ఉద్యానవనాలలో ఎండ తగలకుండా భారీ షెల్టర్లను అందుబాటులోకి తెచ్చారు.
భక్తుల రాకపోకలు అధికంగా ఉండే శ్రీవారి ఆలయ పరిసరాలు, లడ్డూ కౌంటర్ల వద్ద తాత్కాలిక షెల్టర్లను నిర్మించారు. శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులు పట్టుపాదాలతో నడిచేటప్పుడు నేల వేడి తగలకుండా సింథటిక్ ఎనామెల్ కూల్ పెయింట్ వేశారు. అలాగే ఔటర్ రింగ్ రోడ్డు వెంబడి ఏర్పడిన క్యూలైన్లలో తాత్కాలిక మరుగుదొడ్ల సౌకర్యాన్ని, అత్యవసర వైద్యం కోసం మొబైల్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ను ఏర్పాటు చేశారు.
క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండే భక్తుల ఆకలి తీర్చేందుకు టీటీడీ అన్నప్రసాద విభాగం సరికొత్త ప్రణాళికతో ముందుకెళ్తోంది. శ్రీవారి సేవకుల సహాయంతో భక్తులకు నిరంతరాయంగా తాగునీరు, అన్నప్రసాదాలు అందిస్తున్నారు. ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో మొబైల్ వాటర్ డ్రమ్ముల ద్వారా భక్తుల చెంతకే వెళ్లి తాగునీరు పంపిణీ చేస్తున్నారు. అన్నప్రసాదాల విషయానికొస్తే:
- ఉదయం అల్పాహారం: పాలు, ఉప్మా, పొంగల్ అందిస్తున్నారు.
- మధ్యాహ్న భోజనం: రుచికరమైన సాంబారన్నం, పులిహోర, టమోటా రైస్ వితరణ జరుగుతోంది.
- రాత్రి సమయం: పాలు, ఉప్మా మరియు సాంబారన్నం నిరంతరాయంగా పంపిణీ చేస్తున్నారు.
కొండపై వసతి గదుల కొరత ఉన్నందున భక్తులు సహకరించాలని అధికారులు కోరుతున్నారు. తిరుమలలో భౌగోళిక పరిమితుల దృష్ట్యా 60 వేల మందికి మించి వసతి కేటాయించడం సాధ్యం కాదు. ప్రస్తుతం తిరుమలలో 7,500 గదులు, ఐదు యాత్రికుల వసతి సముదాయాలు (PAC) మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
{{/usCountry}}కొండపై వసతి గదుల కొరత ఉన్నందున భక్తులు సహకరించాలని అధికారులు కోరుతున్నారు. తిరుమలలో భౌగోళిక పరిమితుల దృష్ట్యా 60 వేల మందికి మించి వసతి కేటాయించడం సాధ్యం కాదు. ప్రస్తుతం తిరుమలలో 7,500 గదులు, ఐదు యాత్రికుల వసతి సముదాయాలు (PAC) మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
{{/usCountry}}గదులు దొరకని భక్తుల కోసం పీఏసీ-1, పీఏసీ-2, పీఏసీ-3, పీఏసీ-4 (పద్మనాభ నిలయం), పీఏసీ-5లలో దాదాపు 9 వేల లాకర్లను కేటాయించారు. ప్రస్తుతం ఈ సముదాయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. అలాగే స్వామివారికి తలనీలాలు సమర్పించే కల్యాణకట్టల వద్ద రద్దీ పెరిగినందున, ప్రధాన కల్యాణకట్టతో పాటు 11 మినీ కల్యాణకట్టలను అందుబాటులోకి తెచ్చి క్షురకుల ద్వారా నిరంతర సేవలు అందిస్తున్నారు.
శ్రీవారి దర్శనం - గణాంకాలు ఇలా:
గత ఐదు రోజుల్లో నమోదైన శ్రీవారి భక్తుల రద్దీ గణాంకాలు పరిశీలిస్తే భక్తుల రాక ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. గత 5 రోజుల్లోనే ఏకంగా 4,32,213 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. మే 16, 17 తేదీల్లో అత్యధికంగా 90 వేల మందికి పైగా స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే మే 18, 19, 20 తేదీల్లో ప్రతిరోజూ 43 వేల మందికి పైగా తలనీలాలు సమర్పించారు. గత ఐదు రోజుల్లో తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 19 లక్షల మందికి పైగా భక్తులకు అన్నప్రసాదాలు, టీ, కాఫీ, పాలు, మజ్జిగ అందించడం విశేషం.
వేసవి తీవ్రత ఎంత ఉన్నప్పటికీ భక్తులకు నీడ, చల్లని వాతావరణం, తాగునీరు, అన్నప్రసాదాలు, పరిశుభ్రత, లడ్డూల పంపిణీలో ఎలాంటి లోటు రాకుండా టీటీడీ యంత్రాంగం నిరంతరం శ్రమిస్తోంది.