ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటనకు వచ్చారు. పుట్టపర్తిలోని సత్యసాయి శత జయంత్యుత్సవానికి హాజరయ్యారు. సాయి కుల్వంత్ హాల్లో సత్యసాయి మహా సమాధిని ప్రధాని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం జయంతి సందర్బంగా, రైతులకు అందించే గోదాన కార్యక్రమం లోభాగంగా నలుగురు రైతులకు గోదానం చేశారు. ప్రధాని మోదీకి ఆలయ పూజారులు వేద ఆశీస్సులు ఇచ్చారు.

ప్రధాని మోదీతో పాటు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. అంతకంటే ముందు పుట్టపర్తి విమానాశ్రయం వద్ద ప్రధానమంత్రి మోదీకి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ తో పాటు పలువురు మంత్రులు ఘన స్వాగతం పలికారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ప్రజాప్రతినిధులు, నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు.
పుట్టపర్తి ఆధ్యాత్మిక భూమి - ప్రధాని మోదీ
పుట్టపర్తిలో నిర్వహించిన సత్యసాయి శత జయంత్యుత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. పుట్టపర్తి ఆధ్యాత్మిక భూమి అని… సత్యసాయి భౌతికంగా మనతో లేకున్నా.. ఆయన ప్రేమ మనతోనే ఉందన్నారు. ఎన్నో కోట్ల మందికి బాబా మార్గదర్శనం చేశారని గుర్తు చేశారు.
ప్రేమ, సేవకు సత్యాసాయి బాబా ప్రతిరూపంగా నిలిచారన్న ప్రధాని మోదీ.. భక్తి, జ్ఞానం, కర్మ అనేవి సేవతోనే ముడిపడి ఉంటాయని అభిప్రాయపడ్డారు. బాబా జీవితం.. వసుధైక కుటుంబం అనే భావనతో సాగిందన్నారు. బాబా బోధనలు ఎంతో మందిని ప్రభావితం చేశాయి.. బాబా సేవే పరమావధిగా భావించారని కొనియాడారు. అంతకు ముందు సత్యసాయి జీవితం, బోధనలు, సేవల స్మారకార్థంగా రూపొందించిన రూ.100 నాణెం, 4 తపాలా బిళ్లలను ప్రధాని మోదీ ఆవిష్కరించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ… ప్రపంచంలో మనకు కనిపించిన ప్రత్యక్ష దైవం సత్యసాయి అన్నారు. సత్యసాయికి సమ్మోహన శక్తి ఉందని… ఎంతో మంది నాస్తికులను ఆధ్యాత్మికత వైపునకు మళ్లించారని గుర్తు చేశారు. సత్యసాయి సిద్ధాంతాన్ని అందరూ అర్థం చేసుకోవాలన్న ఆయన… సత్యసాయి బాబా జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించామని చెప్పారు.
{{/usCountry}}ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ… ప్రపంచంలో మనకు కనిపించిన ప్రత్యక్ష దైవం సత్యసాయి అన్నారు. సత్యసాయికి సమ్మోహన శక్తి ఉందని… ఎంతో మంది నాస్తికులను ఆధ్యాత్మికత వైపునకు మళ్లించారని గుర్తు చేశారు. సత్యసాయి సిద్ధాంతాన్ని అందరూ అర్థం చేసుకోవాలన్న ఆయన… సత్యసాయి బాబా జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించామని చెప్పారు.
{{/usCountry}}