పోలవరం పనుల పురోగతిని వైసీపీ పార్టీ కళ్లు ఉండి చూడలేనిదిగా తయారైందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్ పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వైసీపీపై మండిపడ్డారు. పోలవరం పనుల పురోగతిపై విమర్శలు చేయడం దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.

ఐదేళ్ళు అధికారం ఇస్తే 2 శాతం పనులు మాత్రమే చేయగలిగారని, అలాంటప్పుడు, ఆపార్టీ పోలవరం పనుల గురించి మాట్లాడటం, విమర్శలు చేయడం విడ్డూరం కాకపోతే మరి ఏమిటని మంత్రి నిమ్మల ప్రశ్నించారు. 2014 -19 హాయంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పోలవరం పనులు72 శాతం పూర్తయ్యాయని మంత్రి రామానాయుడు ఈ సందర్భంగా చెప్పారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే 13 శాతం పూర్తి చేయగలిగామన్నారు. మొత్తంగా చూస్తే పోలవరం ప్రాజెక్టు పనులు 87 శాతం పూర్తి అయినట్లు మంత్రి వివరించారు.
2027 సంవత్సరం చివరికి ఈ ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యక్ష పర్యవేక్షణ, శ్రద్ధతో ఈ ప్రాజెక్టు నిర్దేశిత గడువు కంటే ముందుగా అంటే 2027 గోదావరి పుష్కరాలు నాటికి పూర్తిచేయాలని చెప్పారు.
నాడు కేంద్రం రియంబర్స్ చేసిన 3,000 కోట్ల నిధులను మళ్లించేసి, పోలవరాన్ని ముంచేసిన ఘనుడు జగన్ అని మంత్రి నిమ్మల ఆరోపించారు. జగన్ విధ్వంసం చేసిన డయాఫ్రమ్ వాల్ స్థానంలో నిర్మిస్తున్న కొత్త డయాఫ్రం వాల్ 1032 మీటర్లు, అంటే 83 శాతం నేటికీ పూర్తి చేయగలిగామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక సంవత్సరంలోనే నిర్వాసితులకు ఏడాదిలోనే 1894 కోట్లు విడుదల చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు.
'పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తి చేసి 2026లో అనకాపల్లి వరకు నీరు ఇవ్వబోతున్నాం. 2026 సీజన్ మొదలయ్యే నాటికి వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తి చేసే లక్ష్యంతో పని చేస్తున్నాం. జనవరి మొదటి వారంలో చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టును సందర్శిస్తారు. రూ.456 కోట్లతో వెలిగొండ ఫీడర్ కెనాల్ పనులు ప్రారంభిస్తారు. రాయలసీమలోని హంద్రీనీవా, ఉత్తరాంధ్రలోని అన్ని నీటిపారుదల ప్రాజెక్టులు నిర్ణీత కాలంలో పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం నిశ్చయంతో ఉంది.' అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.
{{/usCountry}}'పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తి చేసి 2026లో అనకాపల్లి వరకు నీరు ఇవ్వబోతున్నాం. 2026 సీజన్ మొదలయ్యే నాటికి వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తి చేసే లక్ష్యంతో పని చేస్తున్నాం. జనవరి మొదటి వారంలో చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టును సందర్శిస్తారు. రూ.456 కోట్లతో వెలిగొండ ఫీడర్ కెనాల్ పనులు ప్రారంభిస్తారు. రాయలసీమలోని హంద్రీనీవా, ఉత్తరాంధ్రలోని అన్ని నీటిపారుదల ప్రాజెక్టులు నిర్ణీత కాలంలో పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం నిశ్చయంతో ఉంది.' అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.
{{/usCountry}}