ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో మాజీ మంత్రి అంబటి రాంబాబును శనివారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరులోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకుని భారీ భద్రత మధ్య నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు. అంతకుముందు…. అంబటి వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ శ్రేణులు ఆయన ఇంటిని ముట్టడించాయి.

ఈ క్రమంలో నిరసనకారులు ఇంటిపై రాళ్లు రువ్వి, కారు మరియు అద్దాలను ధ్వంసం చేశారు. అంతటితో శాంతించని ఆందోళనకారులు… … ఇంటికి నిప్పు పెట్టారు. ఆపై కారుకి కూడా నిప్పు పెట్టగా… వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యాయి. మంటలను ఆర్పేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
అంబటి రాంబాబు తక్షణమే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. అంబటికి వ్యతిరేకంగా భారీ ఎత్తున నినాదాలు చేశారు. పెరిగిన ఉద్రిక్తతల మధ్య… శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి పోలీసులు భారీగా రంగంలోకి దిగారు. మొత్తంగా గుంటూరులోని అంబటి ఇంటి సమీపంలో హైటెన్షన్ వాతావరణమే నెలకొంది.
చంద్రబాబును దూషించిన కేసులో టీడీపీ నేత పిల్లి మాణిక్యరావు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా 126(2),196,352,351 (2),292 రెడ్ విత్ 3(5) BNS సెక్షన్ల కింద అంబటిపై కేసు నమోదైంది. అంతేకాకుండా విధులకు ఆటంకం కల్గించారని నల్లపాడు ఎస్సై కృష్ణమోహన్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా అంబటిపై 126(2),132 BNS సెక్షన్ల కింద మరో కేసులు నమోదు చేశారు.
వైసీపీ నేతలు సీరియస్…
అంబటి ఇంటిపై జరిగిన దాడిని వైసీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆ పార్టీ అధినేత వైెఎస్ జగన్ మోహన్ రెడ్డి… మాజీ మంత్రి అంబటి రాంబాబుతో ఫోన్ లో మాట్లాడారు. రాంబాబు భద్రత గురించి అడిగి తెలుసుకున్నారు. దాడిని తీవ్రంగా ఖండించారు. అడుగడుగునా పార్టీ తరపున పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తామని హామీనిచ్చారు.
“అంబటి ఇంటిపై టీడీపీ గూండాలు, కార్యకర్తలు దాడి చేసి, ఇల్లు ధ్వంసం చేశారు. ఆయనపై, ఆయన కుటుంబ సభ్యులపై హత్యాయత్నం చేశారు. రాష్ట్రంలో జంగిల్ రాజ్ ప్రభుత్వం నడుస్తోంది అని మరోసారి రుజువైంది. తెలుగుదేశం పార్టీని, కూటమి నాయకులకు హెచ్చరిస్తున్నాం మా ప్రభుత్వం రాగానే, కర్మ తిరిగి వస్తే ఎలా ఉంటుందో మీ అందరికీ రుచిచూపిస్తాం” అని వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ హెచ్చరించారు.
{{/usCountry}}“అంబటి ఇంటిపై టీడీపీ గూండాలు, కార్యకర్తలు దాడి చేసి, ఇల్లు ధ్వంసం చేశారు. ఆయనపై, ఆయన కుటుంబ సభ్యులపై హత్యాయత్నం చేశారు. రాష్ట్రంలో జంగిల్ రాజ్ ప్రభుత్వం నడుస్తోంది అని మరోసారి రుజువైంది. తెలుగుదేశం పార్టీని, కూటమి నాయకులకు హెచ్చరిస్తున్నాం మా ప్రభుత్వం రాగానే, కర్మ తిరిగి వస్తే ఎలా ఉంటుందో మీ అందరికీ రుచిచూపిస్తాం” అని వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ హెచ్చరించారు.
{{/usCountry}}