...
...
Next Story

తిరుమల శ్రీవారి సేవలో రాష్ట్రపతి ముర్ము

తిరుమల శ్రీవారిని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దర్శించుకున్నారు. అంతకు ముందు ఆలయ మహాద్వారం వద్ద ఆమెకు అధికారులు, అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు ఆమెకు వేదాశీర్వచనాలిచ్చి తీర్థప్రసాదాలను అందజేశారు.

Published on: Nov 21, 2025, 12:51:45 IST
Advertisement

తిరుమల శ్రీవారిని రాష్ట్రపతి ద్రౌపది దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తిరుమల మహాద్వారానికి వెళ్లిన రాష్ట్రపతి…. మొదట శ్రీ వరాహస్వామి ఆలయాన్ని సందర్శించారు. అంతకంటే ముందు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ బీఆర్ నాయుడు, ఇతర అధికారులు ఆమెకు స్వాగతం పలికారు.

తిరుమల పర్యటనలో రాష్ట్రపతి
తిరుమల పర్యటనలో రాష్ట్రపతి

శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆమె కుటుంబ సభ్యులు, పరివారంతో కలిసి రాష్ట్రపతి ప్రార్థనలు చేశారు. పూజారులతో కలిసి రాష్ట్రపతి మహా ద్వారంలోకి ప్రవేశించి ధ్వజస్తంభం వద్ద ప్రార్థనలు చేశారు. మహాద్వారం వద్ద రాష్ట్రపతి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి,టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు, ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌, అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు ఆమెకు వేదాశీర్వచనాలిచ్చి తీర్థప్రసాదాలను అందజేశారు.

ఆ తర్వాత రాష్ట్రపతి ముర్ముకు తీర్థ ప్రసాదం, వేంకటేశ్వర స్వామి చిత్రపటం, టీటీడీ ప్రచురించిన 2026 డైరీలు, క్యాలెండర్లను అందజేశారు. తిరుపతి జిల్లా తిరుచానూర్ లోని శ్రీ పద్మావతి ఆలయాన్ని కూడా గురువారం సాయంత్రం సందర్శించారు.

హైదరాబాద్ కు రాక:

ఇవాళ మధ్యాహ్నం 1:20 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఆమెకు రాష్ట్ర గవర్నర్‌తో పాటు సీఎం, మంత్రులు,అధికారులు స్వాగతం పలుకుతారు.

ఆ తర్వాత రోడ్డు మార్గంలో రాష్ట్రపతి రాజ్‌భవన్‌కు చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో నిర్వహించే భారతీయ కళామహోత్సవ్‌ 2025ను ఆమె ప్రారంభిస్తారు. తిరిగి శనివారం ఉదయం 9:15 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ఏపీలోని పుట్టపర్తికి బయలుదేరి వెళ్తారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe