ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. విజయనగరం జిల్లా భోగాపురంలో అత్యంత ఆధునిక సదుపాయాలతో రూ.4,727 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన 'అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం' టెర్మినల్ భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఘనంగా ప్రారంభించారు.

ఈ చారిత్రాత్మక ఘట్టంలో ప్రధాని మోదీతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
ప్రారంభోత్సవం అనంతరం నూతన టెర్మినల్ భవనంలో కలియతిరిగిన ప్రధాని మోదీ, ఎయిర్పోర్ట్లో అందుబాటులోకి తీసుకొచ్చిన అత్యాధునిక మౌలిక వసతులను క్షుణ్ణంగా పరిశీలించారు. చెక్-ఇన్ హాల్స్, ఎయిర్పోర్ట్ విశిష్ట డిజైన్, వాడిన వినూత్న సాంకేతికతల గురించి జీఎమ్ఆర్ సంస్థ ప్రతినిధులు ప్రధానికి సమగ్రంగా వివరించారు.
భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ఎయిర్పోర్ట్ మాస్టర్ ప్లాన్, ఏవియేషన్ ఎడ్యుసిటీ, ఏవియేషన్ హబ్ మోడళ్లను ప్రధాని ఆసక్తిగా తిలకించారు.
విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా థింసా నృత్యాన్ని ప్రదర్శించారు. మెుత్తం 13,750 మంది ఈ నృత్యం చేస్తూ ప్రధాని నరేంద్రమోదీకి స్వాగతం పలికారు. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, పోలవరం జిల్లాల నుంచి వచ్చిన గిరిజన మహిళలు, విద్యార్థినులు, మహిళా సంఘాల సభ్యులు థిసా నృత్యంలో పాల్గొన్నారు. టెర్మినల్ భవనం నుంచి సభా వేదిక వైపు వెళ్లే మార్గంలో ప్రత్యేకంగా వేదికను ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ ఓపెన్ టాప్ జీపులో వెళ్తూ నృత్యాన్ని తిలకించారు.
ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవంతో పాటుగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోగతికి ఊతమిచ్చే రూ.17,912 కోట్ల విలువైన పలు ప్రతిష్టాత్మక అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పర్యాటక రంగం, ఐటీ, ఫార్మా ఉత్పత్తుల ఎగుమతులు, పారిశ్రామిక రంగాలు వేగంగా వృద్ధి చెందుతాయని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఉత్తరాంధ్రను గ్లోబల్ ఏవియేషన్ మ్యాప్లో నిలబెట్టడంలో ఈ ఎయిర్పోర్ట్ కీలక పాత్ర పోషించనుంది.
{{/usCountry}}ఈ అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పర్యాటక రంగం, ఐటీ, ఫార్మా ఉత్పత్తుల ఎగుమతులు, పారిశ్రామిక రంగాలు వేగంగా వృద్ధి చెందుతాయని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఉత్తరాంధ్రను గ్లోబల్ ఏవియేషన్ మ్యాప్లో నిలబెట్టడంలో ఈ ఎయిర్పోర్ట్ కీలక పాత్ర పోషించనుంది.
{{/usCountry}}