ఆంధ్రప్రదేశ్లో వరుస బస్సు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఘటనలు మరిచిపోకముందే.. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం శిరివెళ్లమెట్ట దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో బస్సులో ఉన్నవారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పూర్తి వివరాళ్లోకి వెళ్తే..

నెల్లూరు నుంచి హైదరాబాద్కు ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు వెళ్తోంది. ఇందులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత శిరివెళ్లమెట్ట దగ్గరకు బస్సు వచ్చింది. ఈ సమయంలో బస్సు టైరు పేలింది. అంతేకాదు అదుపుతప్పి డివైడర్ దాటి అవతలివైపు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది.
ఈ ప్రమాదం జరిగిన వెంటనే బస్సుకు మంటలు వ్యాపించాయి. ఆ దారిలో వెళ్తున్న డీసీఎం డ్రైవర్ వెంటనే అప్రమత్తమయ్యారు. బస్సు అద్దాలను పగలగొట్టారు. దీంతో ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. కిటికీల్లో నుంచి దూకేశారు. దీనితో కొంతమంది ప్రయాణికులకు స్వల్పగాయాలు అయ్యాయి. మంటలు బాగా వ్యాపించాయి. బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్, క్లీనర్ మంటల్లో కాలిపోయారు. గుర్తుపట్టలేనంతగా అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెంటనే వచ్చారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు.
గతంలో కర్నూలులో
హైదరాబాద్-బెంగళూరు ప్రైవేట్ ట్రావెల్ బస్సు కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద అక్టోబర్ 2025లో కాలి బూడిదైన విషయం తెలిసిందే. ఇందులో ప్రయాణిస్తున్న చాలా మంది మరణించారు. 19 మంది సజీవదహనం అయ్యారు. డ్రైవర్ బస్సు ప్రయాణికుల్లో 39 మంది పెద్దలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనమైంది.
{{/usCountry}}హైదరాబాద్-బెంగళూరు ప్రైవేట్ ట్రావెల్ బస్సు కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద అక్టోబర్ 2025లో కాలి బూడిదైన విషయం తెలిసిందే. ఇందులో ప్రయాణిస్తున్న చాలా మంది మరణించారు. 19 మంది సజీవదహనం అయ్యారు. డ్రైవర్ బస్సు ప్రయాణికుల్లో 39 మంది పెద్దలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనమైంది.
{{/usCountry}}హైవేపై వెళ్తున్న ప్రైవేట్ బస్సు రోడ్డు మీద ఉన్న బైక్ను ఢీకొట్టింది. చాలా దూరం లాక్కెళ్లింది. కాసేపటికి మంటలు చెలరేగడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 19 మంది మరణించారు. చాలా మందికి గాయాలు అయ్యాయి. డీఎన్ఏ పరీక్షల తర్వాత మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు.
బైక్పై వెళ్తున్న శివశంకర్, ఎర్రిస్వామి మద్యం మత్తులో ఉన్నారు. చిన్నటేకూరు సమీపంలో శివశంకర్ బైక్ నడుపుతూ స్కిడ్ అయి రోడ్డుకు కుడివైపున ఉన్న డివైడర్ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో శివశంకర్ అక్కడికక్కడే చనిపోయాడు. రోడ్డు మధ్యలో పడి ఉన్న అతడిని పక్కకు తీశాడు ఎర్రిస్వామి. బైక్ తీద్దామనుకునే సమయంలో బస్సు వచ్చి ఢీకొట్టి లాక్కెళ్లింది. దీంతో బస్సుకు మంటలు వ్యాపించి.. పెద్ద ప్రమాదం జరిగింది.