భోగి మంటలు - 12 సూత్రాలు: భోగి నాడు ఇలా చేస్తే గ్రహ దోషాలు, పీడలు తొలగిపోతాయి!

భోగి పండుగ నాడు భోగి మంటలు వేయడం, ఇంటి ముందు అందమైన ముగ్గులు వేయడం, పిండి వంటలు వండుకోవడం, చిన్నారులకు భోగి పళ్ళు పోయడం ఇలా రకరకాల పద్ధతులను పాటిస్తూ ఉంటారు. అయితే భోగి గురించి చాలా మంది కొన్ని విషయాలు తెలుసుకోవాలి. భోగి నాడు ఇలా చేస్తే గ్రహ దోషాలు, పీడలు తొలగిపోతాయి.

Published on: Jan 13, 2026 1:30 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి ముందు రోజున భోగి పండుగను జరుపుకుంటాము. భోగి పండుగ నాడు భోగి మంటలు వేయడం, ఇంటి ముందు అందమైన ముగ్గులు వేయడం, పిండి వంటలు వండుకోవడం, చిన్నారులకు భోగి పళ్ళు పోయడం ఇలా రకరకాల పద్ధతులను పాటిస్తూ ఉంటారు. అయితే భోగి గురించి చాలా మంది కొన్ని విషయాలు తెలుసుకోవాలి. భోగి నాడు ఇలా చేస్తే గ్రహ దోషాలు, పీడలు తొలగిపోతాయి

భోగి మంటలు - 12 సూత్రాలు: భోగి నాడు ఇలా చేస్తే గ్రహ దోషాలు, పీడలు తొలగిపోతాయి! (pinterest)
భోగి మంటలు - 12 సూత్రాలు: భోగి నాడు ఇలా చేస్తే గ్రహ దోషాలు, పీడలు తొలగిపోతాయి! (pinterest)

భోగి మంటలు.. 12 సూత్రాలు

భోగి పండుగ నాడు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవాలి. బ్రహ్మ ముహూర్తం అంటే ఉదయం నాలుగు నుంచి ఐదు గంటల వరకు. ఈ సమయంలో భోగి మంటలు వేయాలి.

ఇంటికి తూర్పు లేదా ఉత్తర దిశలో ఖాళీగా ఉన్న ప్రదేశంలో ముగ్గు వేసి, దానిపై కర్రలను పేర్చాలి.

మన ఇంట్లో ఉండే పాత చెక్క ముక్కలు, రావి, మేడి, మామిడి చెట్ల కర్రలను, ముఖ్యంగా ఆవు పిడకలను కర్రలపై పేర్చి కర్పూరంతో భోగి మంటను వేయాలి.

మనం అగ్నిని దైవంగా భావిస్తాం కనుక భోగి మంటలో పసుపు, కుంకుమ, అక్షతలు వేయాలి.

ఆ తర్వాత నమస్కారం చేసి మంట చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణలు చేయాలి.

తర్వాత భోగి మంట దగ్గర ఒక బిందె నీళ్లు పెట్టుకోవాలి. చివర్లో మంట తగ్గాక ఆ బిందె నీళ్లను స్నానం చేసే నీటిలో కలుపుకొని ఇంట్లో అందరూ స్నానం చేయాలి. ఈ విధంగా పాటించడం వలన గ్రహ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. చాలా మందికి ఇది తెలియదు.

ఇంటికి హరిదాసు వచ్చినట్లయితే హరిదాసును కూడా భోగి మంట చుట్టూ తిరగమని చెప్పండి. అలా చేయడం వలన ఇంట్లో సుఖశాంతులు కలుగుతాయి.

భోగి మంట పూర్తయిన తర్వాత నీటితో పూర్తిగా మంటను ఆపేసి, ఆ తర్వాత బూడిదను పారబోయకుండా నుదుటన బొట్టు కింద పెట్టుకోవాలి. ఈ విధంగా చేయడం వలన దృష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి.

భోగి నాడు పీడను వదిలించుకోవాలి. ఈ పీడను వదిలించుకోవాలంటే ఉదయం తలంటుకుని భోగి నీటితో స్నానం చేయాలి. ఐదేళ్లలోపు చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోయాలి. అలా చేయడం వలన పీడలు వదిలిపోతాయి.

భోగి మంట సామాన్యమైనది కాదని గుర్తుపెట్టుకోండి. ఇది అగ్నిహోత్రం వంటిదే. దక్షిణాయనానికి, ధనుర్మాసానికి కూడా భోగి పండుగ ఆఖరి రోజు కనుక, ఈ పవిత్రమైన రోజున ఆలయానికి వెళ్లి గోదా కళ్యాణంలో పాల్గొనడం మంచిది.

కచ్చితంగా భోగి నాడు నువ్వులకు సంబంధించినవి తినాలి. నువ్వుల చిమిలి వంటివి తినొచ్చు. ఎవరికైనా నువ్వులను దానంగా ఇస్తే కూడా మంచిది.

భోగి నాడు గొబ్బెమ్మలను పెడితే ఎంతో మంచి జరుగుతుంది. ముగ్గు మధ్యలో పెట్టే గొబ్బెమ్మ భూమాతకు ప్రతీక.