భోగి మంటలు - 12 సూత్రాలు: భోగి నాడు ఇలా చేస్తే గ్రహ దోషాలు, పీడలు తొలగిపోతాయి!
భోగి పండుగ నాడు భోగి మంటలు వేయడం, ఇంటి ముందు అందమైన ముగ్గులు వేయడం, పిండి వంటలు వండుకోవడం, చిన్నారులకు భోగి పళ్ళు పోయడం ఇలా రకరకాల పద్ధతులను పాటిస్తూ ఉంటారు. అయితే భోగి గురించి చాలా మంది కొన్ని విషయాలు తెలుసుకోవాలి. భోగి నాడు ఇలా చేస్తే గ్రహ దోషాలు, పీడలు తొలగిపోతాయి.
ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి ముందు రోజున భోగి పండుగను జరుపుకుంటాము. భోగి పండుగ నాడు భోగి మంటలు వేయడం, ఇంటి ముందు అందమైన ముగ్గులు వేయడం, పిండి వంటలు వండుకోవడం, చిన్నారులకు భోగి పళ్ళు పోయడం ఇలా రకరకాల పద్ధతులను పాటిస్తూ ఉంటారు. అయితే భోగి గురించి చాలా మంది కొన్ని విషయాలు తెలుసుకోవాలి. భోగి నాడు ఇలా చేస్తే గ్రహ దోషాలు, పీడలు తొలగిపోతాయి

భోగి మంటలు.. 12 సూత్రాలు
భోగి పండుగ నాడు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవాలి. బ్రహ్మ ముహూర్తం అంటే ఉదయం నాలుగు నుంచి ఐదు గంటల వరకు. ఈ సమయంలో భోగి మంటలు వేయాలి.
ఇంటికి తూర్పు లేదా ఉత్తర దిశలో ఖాళీగా ఉన్న ప్రదేశంలో ముగ్గు వేసి, దానిపై కర్రలను పేర్చాలి.
మన ఇంట్లో ఉండే పాత చెక్క ముక్కలు, రావి, మేడి, మామిడి చెట్ల కర్రలను, ముఖ్యంగా ఆవు పిడకలను కర్రలపై పేర్చి కర్పూరంతో భోగి మంటను వేయాలి.
మనం అగ్నిని దైవంగా భావిస్తాం కనుక భోగి మంటలో పసుపు, కుంకుమ, అక్షతలు వేయాలి.
ఆ తర్వాత నమస్కారం చేసి మంట చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణలు చేయాలి.
తర్వాత భోగి మంట దగ్గర ఒక బిందె నీళ్లు పెట్టుకోవాలి. చివర్లో మంట తగ్గాక ఆ బిందె నీళ్లను స్నానం చేసే నీటిలో కలుపుకొని ఇంట్లో అందరూ స్నానం చేయాలి. ఈ విధంగా పాటించడం వలన గ్రహ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. చాలా మందికి ఇది తెలియదు.
ఇంటికి హరిదాసు వచ్చినట్లయితే హరిదాసును కూడా భోగి మంట చుట్టూ తిరగమని చెప్పండి. అలా చేయడం వలన ఇంట్లో సుఖశాంతులు కలుగుతాయి.
భోగి మంట పూర్తయిన తర్వాత నీటితో పూర్తిగా మంటను ఆపేసి, ఆ తర్వాత బూడిదను పారబోయకుండా నుదుటన బొట్టు కింద పెట్టుకోవాలి. ఈ విధంగా చేయడం వలన దృష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి.
భోగి నాడు పీడను వదిలించుకోవాలి. ఈ పీడను వదిలించుకోవాలంటే ఉదయం తలంటుకుని భోగి నీటితో స్నానం చేయాలి. ఐదేళ్లలోపు చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోయాలి. అలా చేయడం వలన పీడలు వదిలిపోతాయి.
భోగి మంట సామాన్యమైనది కాదని గుర్తుపెట్టుకోండి. ఇది అగ్నిహోత్రం వంటిదే. దక్షిణాయనానికి, ధనుర్మాసానికి కూడా భోగి పండుగ ఆఖరి రోజు కనుక, ఈ పవిత్రమైన రోజున ఆలయానికి వెళ్లి గోదా కళ్యాణంలో పాల్గొనడం మంచిది.
కచ్చితంగా భోగి నాడు నువ్వులకు సంబంధించినవి తినాలి. నువ్వుల చిమిలి వంటివి తినొచ్చు. ఎవరికైనా నువ్వులను దానంగా ఇస్తే కూడా మంచిది.
భోగి నాడు గొబ్బెమ్మలను పెడితే ఎంతో మంచి జరుగుతుంది. ముగ్గు మధ్యలో పెట్టే గొబ్బెమ్మ భూమాతకు ప్రతీక.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


