ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఆధ్వర్యంలోని అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్ ఫ్లైట్ టెస్టింగ్ ప్రాజెక్టు శిలాఫలకాన్ని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ ప్రాజెక్టుకు అనుబంధంగా ఉన్న కల్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, హెచ్ఎఫ్ సీఎల్ ప్రాజెక్టులకు చెందిన శిలాఫలకాలను వర్చువల్గా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ... పుట్టపర్తి సత్యసాయి బాబా బోధనలతో విశ్వశాంతికి బాటలు పడ్డాయన్నారు. పుట్టపర్తిలో అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టు రావటం ఎంతో కీలకమని చెప్పారు. దేశం గర్వించే వ్యూహాత్మకమైన రక్షణ కేంద్రంగానూ పుట్టపర్తి మారుతుందన్నారు. AMCA ప్రాజెక్టుతో ఆత్మనిర్బర్ భారత్ లక్ష్యసాధనలో ఏపీ ముఖ్యపాత్ర పోషిస్తుందన్నారు.
'భారత రక్షణ రంగాన్ని ఆధునీకరించటంతో పాటు బలోపేతం చేయటంపై ప్రధాని దృష్టి సారించారు. ఆధునికతరం స్టెల్త్ యుద్ధ విమానాలను తయారు చేసేలా AMCA ప్రాజెక్టు ఏర్పాటు అవుతోంది. భారత రక్షణ శక్తిని ప్రపంచానికి చాటటంలో ఆపరేషన్ సింధూర్ ఓ ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. ఆపరేష్ సింధూర్లో వినియోగించిన డ్రోన్లు ఏపీలోనే తయారై, టెస్ట్ చేశారు. AMCA లాంటి ప్రాజెక్టును ఏపీకి కేటాయించినందుకు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్కు ధన్యవాదాలు.' అని చంద్రబాబు అన్నారు.
రూ.15 వేల కోట్లకు పైగా పెట్టుబడితో 7500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రాజెక్టు వస్తుందని చంద్రబాబు చెప్పారు. ఫైటర్ జెట్ ఇంటిగ్రేషన్తో పాటు ఫ్లైట్ టెస్టింగ్ కేంద్రంగా పుట్టపర్తి మారుతుందన్నారు. అత్యంత వేగంగా ఈ ప్రాజెక్టును సాకారం చేయటంలో రక్షణ శాఖ, కేంద్ర ప్రభుత్వ సహకారం అందించాయని తెలిపారు. కేవలం 36 రోజుల్లోనే ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగలిగాం... జెట్ స్పీడ్తో అనుమతులిచ్చామన్నారు.
'ఏరోస్పేస్ రంగంలో కీలకమైన ప్రాజెక్టుతో మరికొన్ని డిఫెన్సు ప్రాజెక్టులు కూడా వస్తాయి. భారత్ ఫోర్జ్, హెచ్ఎఫ్ సీఎల్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, కర్నూలు జిల్లాలో డ్రోన్ సిటీలకు శంకుస్థాపన చేశాం. ఇటీవల యుద్ధాల్లో డ్రోన్లే కీలకంగా మారాయి. వ్యవసాయం నుంచి చాలా రంగాల్లో డ్రోన్ల వినియోగం పెరిగింది. ఓర్వకల్లులో డ్రోన్ సిటీ ఏర్పాటు చేసి ఉత్పత్తి చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.' అని చంద్రబాబు అన్నారు.
{{/usCountry}}'ఏరోస్పేస్ రంగంలో కీలకమైన ప్రాజెక్టుతో మరికొన్ని డిఫెన్సు ప్రాజెక్టులు కూడా వస్తాయి. భారత్ ఫోర్జ్, హెచ్ఎఫ్ సీఎల్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, కర్నూలు జిల్లాలో డ్రోన్ సిటీలకు శంకుస్థాపన చేశాం. ఇటీవల యుద్ధాల్లో డ్రోన్లే కీలకంగా మారాయి. వ్యవసాయం నుంచి చాలా రంగాల్లో డ్రోన్ల వినియోగం పెరిగింది. ఓర్వకల్లులో డ్రోన్ సిటీ ఏర్పాటు చేసి ఉత్పత్తి చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.' అని చంద్రబాబు అన్నారు.
{{/usCountry}}శ్రీహరికోట అంతరిక్షశక్తి, నాగాయలంకలో క్షిపణిశక్తి, పుట్టపర్తి రక్షణ శక్తి, విశాఖ నుంచి నౌకాదళ శక్తిగా ఏపీ దేశానికే అండగా నిలుస్తుందని చంద్రబాబు చెప్పారు. గతంలో రాయలసీమ రతనాల సీమ.. కానీ వివిధ కారణాల వల్ల కరవుసీమగా మారిపోయిందన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక మళ్లీ ఆ పరిస్థితిని మార్చామని తెలిపారు. ఆనాడు ఎన్టీఆర్, ఈనాడు కూటమి ప్రభుత్వం రాయలసీమకు నీరిచ్చేందుకు కృషి చేస్తున్నామని సీఎం చెప్పారు. ప్రతీ ఎకరాకూ నీరిచ్చేలా కార్యాచరణ చేపట్టాం. కియా పరిశ్రమకు నీరిచ్చాం. లక్ష కోట్ల రూపాయలతో సీమను హార్టికల్చర్ హబ్ గా తయారు చేస్తున్నామన్నారు.