విజయవాడ ఆటోనగర్లోని ఏపీఐఐసీ రైతు బజార్లో వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తక్కువ ధరకే నాణ్యమైన బియ్యాన్ని అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. వినియోగదారులకు భారీ ఊరటగా రూ.52కే కిలో నాణ్యమైన సన్న బియ్యం అందుబాటులోకి తెచ్చింది ప్రభుత్వం.

150 రైతు బజార్లు, 500 రైస్మిల్ అవుట్లెట్లలో విక్రయాలు ప్రారంభం అయ్యాయి. ధరల స్థిరీకరణకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. బియ్యం ధరల పెరుగుదల నేపథ్యంలో వినియోగదారులకు ఉపశమనం కల్పించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.
బహిరంగ మార్కెట్లో కిలోకు సుమారు రూ.10 వరకు ధరలు పెరిగినట్లు గుర్తించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్తో కలిసి తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం సరఫరా నిర్ణయం తీసుకుంది సర్కార్. బీపీటీ స్టీమ్ రైస్ను రూ.64–65 నుంచి తగ్గించి రూ.52కే అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఒక్క కుటుంబానికి 10 కిలోల వరకు ఈ ధరకు బియ్యం కొనుగోలు అవకాశం ఉంటుంది. బీపీటీ పచ్చి బియ్యం రూ.58–60 నుంచి తగ్గించి రూ.50కే విక్రయిస్తున్నారు. సబ్సిడీ ధరల విక్రయాలు రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 2 నుంచే ప్రారంభం అయ్యాయి. రాష్ట్రంలోని రైతు బజార్లు, రైస్మిల్ అవుట్లెట్ల ద్వారా విస్తృతంగా సరఫరా జరుగుతుంది.
బహిరంగ మార్కెట్ ధరలపై నియంత్రణ సాధించడమే లక్ష్యమని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. దేశంలోనే తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం అందించే ప్రత్యేక కార్యక్రమంపై జనాలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం కావాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కందిపప్పు, పామాయిల్ ధరల నియంత్రణపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. వినియోగదారుల ప్రయోజనాలే లక్ష్యంగా నిరంతర చర్యలు కొనసాగుతాయని మంత్రి నాదెండ్ల అన్నారు.
'ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 650 కేంద్రాల ద్వారా తక్కువ ధరకే బియ్యం విక్రయాల కార్యక్రమాన్ని విజయవాడ APIIC రైతు బజార్లో ప్రారంభించాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మార్గదర్శకత్వంలో ప్రజలపై ధరల భారాన్ని తగ్గించి, నాణ్యమైన బియ్యాన్ని అందుబాటు ధరల్లో అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇదే రకం బియ్యం కిలో రూ.60–62కు విక్రయమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కేవలం రూ.50–52కే నాణ్యమైన బియ్యాన్ని అందుబాటులోకి తీసుకురావచ్చాం.' అని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
{{/usCountry}}'ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 650 కేంద్రాల ద్వారా తక్కువ ధరకే బియ్యం విక్రయాల కార్యక్రమాన్ని విజయవాడ APIIC రైతు బజార్లో ప్రారంభించాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మార్గదర్శకత్వంలో ప్రజలపై ధరల భారాన్ని తగ్గించి, నాణ్యమైన బియ్యాన్ని అందుబాటు ధరల్లో అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇదే రకం బియ్యం కిలో రూ.60–62కు విక్రయమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కేవలం రూ.50–52కే నాణ్యమైన బియ్యాన్ని అందుబాటులోకి తీసుకురావచ్చాం.' అని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
{{/usCountry}}