...
...
Next Story

ఏపీకి రెడ్ అలర్ట్ - రాగల 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు!

AP Weather Updates : ఏపీలోని పలు జిల్లాలకు విపత్తుల నిర్వహణ సంస్థ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాగల మూడు గంటల్లో అల్లూరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు, బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

Published on: May 23, 2026 04:37 PM IST
Advertisement

AP Weather Updates : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తీవ్రమైన ఎండల తీవ్రత మధ్య ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం అలుముకుంది. రాగల మూడు గంటల్లో అల్లూరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు, బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ బులెటిన్ విడుదల చేసింది.

ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ …

ఏపీకి రెడ్ అలర్ట్ : రాగల 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు!
ఏపీకి రెడ్ అలర్ట్ : రాగల 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు!

ఉత్తర కోస్తాంధ్ర పరిసర ప్రాంతాలలో వాతావరణం వేగంగా మారుతోంది. రాగల మూడు గంటల్లో ముఖ్యంగా మూడు జిల్లాల్లో ప్రకృతి బీభత్సం సృష్టించే అవకాశం ఉంది.

  • అల్లూరి సీతారామరాజు జిల్లా
  • అనకాపల్లి జిల్లా
  • కాకినాడ జిల్లా

ఈ మూడు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అత్యంత ముఖ్యంగా ఈ జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం ఎక్కువగా ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి.

మరోవైపు విజయనగరం జిల్లా పరిసర ప్రాంతాలలో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. ఈ జిల్లాలో రాగల మూడు గంటల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. అక్కడక్కడా ఉరుములు పడే అవకాశం ఉన్నందున స్థానిక యంత్రాంగం సిద్ధంగా ఉండాలని సూచించింది.

వర్షంతో పాటు రాష్ట్రంలో బలమైన ఈదురుగాలులు వీచనున్నాయి. ఈ విపత్కర సమయంలో గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే ప్రమాదం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) ప్రఖర్ జైన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. గాలుల తీవ్రతకు బలహీనంగా ఉన్న నిర్మాణాలు, చెట్ల కొమ్మలు విరిగిపడే అవకాశం ఉందన్నారు.

ప్రస్తుత వాతావరణ పరిస్థితులను జిల్లాల కలెక్టర్లు, స్థానిక రెవెన్యూ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అత్యవసర సహాయం కోసం నియమిత కంట్రోల్ రూమ్ నంబర్లను సంప్రదించాలని అధికారులు కోరారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe