కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్తో రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. రాష్ట్రంలోని శనగ, మొక్కజొన్న రైతుల పరిస్థితులను వివరించారు. రాష్ట్రంలో ఈ ఏడాది శనగ సాగు పెరిగి 7.13 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిన నేపథ్యంలో, ఇప్పటికే 94,500 మెట్రిక్ టన్నుల కొనుగోలు పూర్తయిందని, మిగిలిన పంటను కూడా కొనుగోలు చేయాలని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వ విన్నపానికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. పీఎస్ఎస్ స్కీం కింద అదనంగా 15,000 మెట్రిక్ టన్నుల శనగ కొనుగోలుకు తక్షణమే అనుమతి ఇచ్చారు. మిగిలిన 68,750 మెట్రిక్ టన్నుల శనగలను కూడా త్వరలోనే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటాం, రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని తెలిపారు.
మిరప, పొగాకు రైతులు పంటల వైవిధ్యీకరణ చేపట్టడం వల్ల ఈ ఏడాది మొక్కజొన్న సాగు విస్తీర్ణం, ఉత్పత్తి పెరిగాయని అచ్చెన్నాయుడు వివరించారు. ప్రస్తుతం ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) కింద మొక్కజొన్నను సేకరించనప్పటికీ, పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక సేకరణ చర్యలు చేపట్టాలని అభ్యర్థించారు.
'అలాగే మొక్కజొన్న రైతుల సమస్యలను కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లాను. క్రాప్ డైవర్షన్ వల్ల మొక్కజొన్న సాగు పెరిగినప్పటికీ, అంతర్జాతీయ పరిస్థితులు, ఇతర కారణాల వల్ల ధరలు తగ్గి రైతులకు నష్టం కలిగే పరిస్థితి ఏర్పడింది. పీడీఎస్ స్కీంలో లేకపోయినప్పటికీ, ప్రస్తుత ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరాను.' అని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు.
ఈ అంశంపై కేంద్ర ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో మాట్లాడి త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని చెప్పారు. రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టం కలగనీయబోమని, కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ ప్రతి రైతుకు న్యాయం చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. రైతులు కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు అమ్ముకోవలసి వస్తోందని పేర్కొన్నారు. ఆలస్యం చేయకుండా కొనుగోలు కేంద్రాలను తెరవాలని కేంద్రాన్ని కోరారు.
{{/usCountry}}మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. రైతులు కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు అమ్ముకోవలసి వస్తోందని పేర్కొన్నారు. ఆలస్యం చేయకుండా కొనుగోలు కేంద్రాలను తెరవాలని కేంద్రాన్ని కోరారు.
{{/usCountry}}రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటిస్తూ, లాభదాయకమైన ధరలు, తగినంత మార్కెట్ మద్దతు లభించేలా కేంద్రంతో సమన్వయంతో అన్ని ప్రయత్నాలు చేస్తామని అచ్చెన్నాయుడు అన్నారు.