ఏపీలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన సర్వమత సామరస్య వేడుక నెల్లూరు ‘రొట్టెల పండుగ-2026’కు సర్వం సిద్ధమవుతోంది. నెల్లూరు నగరంలోని బారా షాహిద్ దర్గా వేదికగా జూన్ 26 నుంచి నాలుగు రోజుల పాటు ఈ వార్షిక మహోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది. ఈ పండుగకు ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుతోపాటు ఇతర ప్రాంతాల నుంచి దాదాపు 14 లక్షల మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ నేతృత్వంలోని ఉత్సవ కమిటీ ఈ వేడుకలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముఖ్యంగా పారిశుధ్యం, తాగునీరు, వసతి సౌకర్యాలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కమిటీ ప్రకటించింది.
భారీగా తరలివచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. నెల్లూరు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ డాక్టర్ అజిత వేజెండ్ల భద్రతా ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో కలిసి ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కులమతాలకు అతీతంగా లక్షలాది మంది భక్తులు ఈ పండుగకు వస్తారని, వారి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.
దర్గా పరిసర ప్రాంతాల్లో, నెల్లూరు నగరంలో ట్రాఫిక్ జామ్ కాకుండా ప్రత్యేక రూట్ మ్యాప్, పార్కింగ్ స్థలాల ఏర్పాటు చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దర్గా ప్రాంగణంలో సీసీటీవీ కెమెరాల నిఘా, భారీగా పోలీస్ బందోబస్తు ఉంటుంది. స్వర్ణాల చెరువు వద్ద భక్తులు రొట్టెలు వదులుకునే సమయంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక రక్షణ చర్యలు, ఈతగాళ్ల ఏర్పాటు చేస్తున్నారు.
'సీసీటీవీ పర్యవేక్షణ, డ్రోన్ సర్వైలెన్స్, కమాండ్ కంట్రోల్ వ్యవస్థ, QRT అండ్ BD టీమ్స్, డాగ్ స్క్వాడ్స్తో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో సురక్షితమైన, సజావుగా జరిగే పండగ నిర్వహణకు జిల్లా పోలీసులు కట్టుబడి ఉన్నారు.' అని ఉన్నతాధికారులు చెప్పారు.
{{/usCountry}}'సీసీటీవీ పర్యవేక్షణ, డ్రోన్ సర్వైలెన్స్, కమాండ్ కంట్రోల్ వ్యవస్థ, QRT అండ్ BD టీమ్స్, డాగ్ స్క్వాడ్స్తో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో సురక్షితమైన, సజావుగా జరిగే పండగ నిర్వహణకు జిల్లా పోలీసులు కట్టుబడి ఉన్నారు.' అని ఉన్నతాధికారులు చెప్పారు.
{{/usCountry}}నెల్లూరు రొట్టెల పండుగకు ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. తమ కోర్కెలు నెరవేరిన వారు దర్గా సమీపంలోని స్వర్ణాల చెరువులో దిగి రొట్టెలను మొక్కుబడిగా సమర్పిస్తారు. కొత్తగా కోర్కెలు కోరుకునే వారు ఆ రొట్టెలను అందుకుంటారు. ఆరోగ్యం, వివాహం, ఉద్యోగం, విద్య, వ్యాపారం, విదేశీ ప్రయాణం వంటి వివిధ కోర్కెల కోసం ఇక్కడ భక్తులు మార్పిడి చేసుకుంటారు. మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ వేడుకలో హిందువులు, ముస్లింలు అనే తేడా లేకుండా అందరూ కలిసి పాల్గొనడం ఈ పండుగ ప్రత్యేకత.