శబరిమలలో 10 లక్షలకు చేరువలో భక్తులు.. అయ్యప్ప దర్శనానికి కొనసాగుతున్న రద్దీ!

శబరిమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మండల మకరవిళక్కు తీర్థయాత్ర ప్రారంభమైనప్పటి నుండి ఆలయాన్ని సందర్శించిన వారి సంఖ్య పది లక్షలకు చేరుకుంటోంది.

Published on: Nov 27, 2025 11:52 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

శబరిమల అయ్యప్పను దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో రద్దీ కొనసాగుతోంది. నిన్న సాయంత్రం 7 గంటల వరకు 72,385 మంది ఆలయాన్ని సందర్శించారు. ఇప్పటి వరకు మెుత్తం 9,40,486 మంది దర్శనాలు చేసుకున్నారు. ఈరోజుతో పది లక్షల మార్క్ దాటుతుంది. ఆలయ రద్దీకి అనుగుణంగా పంపా నుండి భక్తులను బయటకు పంపుతున్నారు.

శబరిమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
శబరిమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

మండల పూజ్ సీజన్‌లో బాగంగా ఈ నెల 16వ తేదీన శబరిమలలోని అయ్యప్ప స్వామి ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. రికార్డు స్థాయిలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో కేరళ హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. దీంతో రోజూవారీ స్పాట్ బుకింగ్స్ ఐదు వేలకు పరిమిత చేశారు. భక్తుల రద్దీ ఆధారంగా పెంచుకోవాని కోర్టు సూచించింది. పోలీసులు భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. మండల మకరవిళక్కు సీజన్‌లో శబరిమల ఆదాయం రూ.60 కోట్లు దాటింది.

భక్తుల దర్శనాలకు ఇబ్బందులు కలగకుండా ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు ఏర్పా్ట్లు చేసింది. ఆన్‌లైన్ స్లాట్లు, స్పాట్ బుకింగ్స్ వెంటవెంటనే అయిపోతున్నాయి. పంపా బేస్ వద్ద నుంచే భక్తులు కిక్కిరిసిపోయి కనిపిస్తున్నారు. సన్నిధానం చేరుకునేందుకు చాలా టైమ్ పడుతుంది.

బస్సు బోల్తా

మరోవైపు శబరిమల యాత్రికులను తీసుకెళ్తున్న బస్సు బోల్తా పడింది, 20 మంది గాయపడ్డారు. వారిలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కొల్లం-తేని జాతీయ రహదారిపై కుట్టిక్కనం, వల్లంజకణం మధ్య ఈ ప్రమాదం జరిగింది. తమిళనాడులోని కరూర్ నుండి యాత్రికులను తీసుకెళ్తున్న బస్సు కుట్టిక్కనం దాటి వెళ్తుంటే ఒక వంపు వద్ద నియంత్రణ కోల్పోయి బోల్తా పడింది. అందులో 43 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదం ఉదయం 6 గంటల ప్రాంతంలో జరిగింది. గాయపడిన వారిలో ఒకరికి తలకు తీవ్ర గాయం కాగా, మరొకరికి చేతికి తీవ్ర గాయాలయ్యాయి.

క్షతగాత్రులను ముండక్కాయం మెడికల్ ట్రస్ట్ ఆసుపత్రికి తరలించారు, పరిస్థితి విషమంగా ఉన్న వారిని కొట్టాయం ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. స్థానిక ప్రయాణికులు, హైవే పోలీసులు, అగ్నిమాపక దళం సహాయక చర్యలను వేగంగా చేపట్టారు. కొండ ప్రాంతాలతో డ్రైవర్లకు తెలియకపోవడంతో ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయని పోలీసు అధికారులు తెలిపారు. కొండ ప్రాంతాల్లో రోడ్లపై ప్రయాణించేటప్పుడు జాగ్రత్త వహించాలని సూచించారు.

News/Andhra Pradesh/శబరిమలలో 10 లక్షలకు చేరువలో భక్తులు.. అయ్యప్ప దర్శనానికి కొనసాగుతున్న రద్దీ!
News/Andhra Pradesh/శబరిమలలో 10 లక్షలకు చేరువలో భక్తులు.. అయ్యప్ప దర్శనానికి కొనసాగుతున్న రద్దీ!