పథకాల అమలు పరిశీలనపై నవంబర్ నుండి సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయి పర్యటనలు!

సీఎం చంద్రబాబు నాయుడు నవంబర్ నుంచి క్షేత్రస్థాయి పర్యనలు చేయనున్నారు. ప్రభుత్వం అందించే పథకాలు ప్రజలకు అందుతున్నాయో.. లేదా అని పరిశీలించనున్నారు.

Published on: Oct 16, 2025, 05:43:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అనేక పథకాలు, కార్యక్రమాల అమలును సమీక్షించడానికి, లబ్ధిదారులు వాటి నుండి ఎలా లాభపడుతున్నారో తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చే నెల నుండి క్షేత్రస్థాయి పర్యటనలు చేయనున్నారు. సచివాలయంలో సమాచార మంత్రి కొలుసు పార్థసారథి, ఐటీ, ఆర్‌టీజీఎస్, ఎక్సైజ్, భూగర్భ జల శాఖల అధికారులతో చంద్రబాబు సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించారు. రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ పనితీరును కూడా పరిశీలించారు.

సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు

'నేను కొన్ని ప్రదేశాలను సందర్శించి, సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి పౌరుడికి చేరుతున్నాయో లేదో పరిశీలిస్తాను.' అని చంద్రబాబు అన్నారు. జీఎస్టీ 2.0 సంస్కరణల అమలుపై ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. సెప్టెంబర్ 22 నుండి రాష్ట్రంలో 'సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్' అనే పేరుతో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. దీపావళి పండుగ తర్వాత పన్నులు ఎలా తగ్గాయో విస్తృతంగా అవగాహన ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. జీఎస్టీ 2.0 సంస్కరణలను సినిమా థియేటర్లలో స్లైడ్‌ల రూపంలో ప్రదర్శించాలని సూచించారు.

టెక్నాలజీ ఆడిటింగ్ ద్వారా ప్రజల సంతృప్తి స్థాయిలను అంచనా వేస్తామని, అధికారులు అందించే సమాచారం, వాస్తవ పరిస్థితులను పోల్చి చూస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. 'ఒక ప్రభుత్వం-ఒక పౌరుడు కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా సామాన్య ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే మా లక్ష్యం. నవంబర్ మొదటి వారంలో మంత్రులు, కార్యదర్శులు, జిల్లా కలెక్టర్ల పనితీరుపై సమీక్షిస్తాం.' అని చంద్రబాబు అన్నారు.

వాహన ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు అధికారులు చలాన్లు విధించడం ద్వారా వాహన వినియోగదారులను ఇబ్బంది పెట్టకూడదని చంద్రబాబు అన్నారు. పీపీపీ పద్ధతిలో వైద్య కళాశాలల అభివృద్ధిపై జరుగుతున్న తప్పుడు సమాచార ప్రచారాన్ని ఆయన ఖండించారు. పీపీపీతో అదనపు సీట్లు లభిస్తాయని, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని ప్రభుత్వం హామీ ఇస్తుందని సీఎం పేర్కొన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More