...
...
Next Story

SCR : కాకినాడ-లింగంపల్లి మధ్య స్పెషల్ ట్రైన్స్.. తిరుమల ఎక్స్‌ప్రెస్‌పై కీలక అప్డేట్

SCR Special Trains : ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అందులో భాగంగా తాజాగా మరో సర్వీస్ ప్రకటించింది.

Published on: Apr 30, 2026, 06:29:05 IST
Advertisement

వేసవిలో రద్దీని దృష్టిలో పెట్టుకుని.. దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణించేవారికి ఈ రైళ్లు ఎంతగానో ఉపయోగకరంగా ఉండనున్నాయి. కాకినాడ-లింగంపల్లి మద్య ఈ సర్వీసులు నడుస్తాయి. ఏ తేదీల్లో ఈ సర్వీసులు నడుస్తాయో చూద్దాం..

దక్షిణ మధ్య రైల్వే
దక్షిణ మధ్య రైల్వే

07703 కాకినాడ టౌన్-లింగంపల్లి మధ్య ట్రైన్ శుక్ర, శని, ఆదివారాల్లో నడవనుంది. సాయంత్రం 6 గంటల 55 నిమిషాలకు కాకినాడ నుంచి బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 8 గంటలకు చేరుకుంటుంది. మే 01, 02, 03వ తేదీల్లో ఈ ట్రైన్ ఉంది.

07704 లింగంపల్లి-కాకినాడ టౌన్ మధ్య రైలు శని, ఆది, సోమవారాల్లో నడుస్తాయి. రాత్రి 8 గంటలకు లింగపల్లిలో బయల్దేరి.. ఉదయం 7.45 నిమిషాలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది.

6 ట్రిప్పులు నడిచే ఈ ట్రైన్.. సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లి, సికింద్రాబాద్, బేగంపేట స్టేషన్లలో ఆగుతుంది.

గుంతకల్ వరకు తిరుమల ఎక్స్‌ప్రెస్

ప్రస్తుతం కడప-విశాఖపట్నం మధ్య నడుస్తున్న తిరుమల ఎక్స్‌ప్రెస్ (రైలు నెం. 18521/18522), ఇకపై తన సాధారణ షెడ్యూల్ ప్రకారం గుంతకల్-విశాఖపట్నం మధ్య నడుస్తుంది. ప్రస్తుతం కడప, విశాఖపట్నం మధ్య నడుస్తున్న తిరుమల ఎక్స్‌ప్రెస్ (రైలు నెం. 18521/18522) ఇకపై తన సాధారణ షెడ్యూల్ ప్రకారం గుంతకల్, విశాఖపట్నం మధ్య నడుస్తుంది.

అనంతపురం ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ.. జిల్లా ప్రజల ప్రయాణ అవసరాలను హైలైట్ చేస్తూ.. ఈ విషయాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ, సంబంధిత అధికారుల దృష్టికి పదేపదే తీసుకువచ్చారు. ఆయన విజ్ఞప్తులకు స్పందిస్తూ, డివిజనల్ ప్రధాన కార్యాలయమైన గుంతకల్ వరకు సర్వీసును పొడిగించడానికి రైల్వే అధికారులు అంగీకరించారు. విస్తరించిన ఈ సర్వీసును మే 12న గుంతకల్ రైల్వే స్టేషన్‌లో లాంఛనంగా ప్రారంభిస్తారని, ఈ సందర్భంగా ఎంపీ రైలును జెండా ఊపి ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe