పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, పరిసర ప్రాంతాల రైల్వే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రస్తుతం ప్రత్యేక రైళ్లుగా నడుస్తున్న రెండు కీలక సర్వీసులను ఇకపై శాశ్వత ప్రాతిపదికన రెగ్యులర్ రైళ్లుగా నడపనున్నట్లు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఒక ప్రకటనలో వెల్లడించారు.
రెగ్యులర్ కానున్న రైళ్లు
- నరసాపురం - తిరువణ్ణామలై (అరుణాచలం)
- నరసాపురం - బెంగళూరు (మల్లేశ్వరం/యశ్వంతపూర్ మార్గం)

ఇప్పటివరకు ఈ రెండు రైళ్లను ప్రత్యేక కేటగిరీ కింద నడపడం వల్ల ప్రయాణికులపై అదనపు ఛార్జీల భారం పడేది. ఈ నిర్ణయంతో ఇకపై సాధారణ రైలు ఛార్జీలతోనే ప్రయాణించే అవకాశం కలగనుంది.
తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం అరుణాచలానికి (తిరువణ్ణామలై) వెళ్లే శివభక్తులకు ఈ నిర్ణయం ఎంతో ఊరటనిస్తుంది. ప్రతి నెల పౌర్ణమి గిరిప్రదక్షిణ కోసం గోదావరి జిల్లాల నుండి వేలాది మంది భక్తులు అరుణాచలం వెళ్తుంటారు. ఇప్పుడు డైరెక్ట్ రెగ్యులర్ ట్రైన్ అందుబాటులోకి రావడం వల్ల ప్రయాణం మరింత సులభతరం కానుంది.
నరసాపురం, భీమవరం, పాలకొల్లు పరిసర ప్రాంతాల నుండి బెంగళూరులో స్థిరపడిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వ్యాపారవేత్తలకు ఈ బెంగళూరు రెగ్యులర్ సర్వీస్ ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. ముఖ్యంగా వారాంతాల్లో సొంతూళ్లకు వచ్చే వారికి టికెట్ల లభ్యత పెరగనుంది.
ఈ రెండు రైళ్లకు సంబంధించిన రైలు నంబర్లు, ఏ రోజుల్లో నడుస్తాయనే అధికారిక షెడ్యూల్ను దక్షిణ మధ్య రైల్వే (SCR) త్వరలోనే విడుదల చేయనుందని మంత్రి శ్రీనివాస వర్మ తెలిపారు. దీనికోసం ప్రత్యేక చొరవ తీసుకున్న రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.
గుంటూరు-తిరుచిరాపల్లి
గుంటూరు - తిరుపతి ఎక్స్ప్రెస్ను తమిళనాడులోని తిరుచిరాపల్లి వరకు పొడిగిస్తూ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ నుంచి అరుణాచలం, శ్రీరంగం వెళ్లే భక్తులకు ఈ రైలు ఎంతోప్రయోజనకరం కానుంది. సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న డిమాండ్ను నెరవేరుస్తూ…. గుంటూరు-తిరుపతి ఎక్స్ప్రెస్ను (రైలు నంబర్లు: 17261/17262) తమిళనాడులోని తిరుచిరాపల్లి వరకు పొడిగించేందుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది.
{{/usCountry}}గుంటూరు - తిరుపతి ఎక్స్ప్రెస్ను తమిళనాడులోని తిరుచిరాపల్లి వరకు పొడిగిస్తూ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ నుంచి అరుణాచలం, శ్రీరంగం వెళ్లే భక్తులకు ఈ రైలు ఎంతోప్రయోజనకరం కానుంది. సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న డిమాండ్ను నెరవేరుస్తూ…. గుంటూరు-తిరుపతి ఎక్స్ప్రెస్ను (రైలు నంబర్లు: 17261/17262) తమిళనాడులోని తిరుచిరాపల్లి వరకు పొడిగించేందుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది.
{{/usCountry}}ఈ పొడిగింపు నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులకు ప్రయాణ కష్టాలు తీరనున్నాయి. నంద్యాల, కడప మీదుగా ప్రయాణించే ఈ రైలు ద్వారా భక్తులు ఇప్పుడు ఒకే ప్రయాణంలో పలు ప్రధాన క్షేత్రాలను దర్శించుకోవచ్చు. కాణిపాకం, వెల్లూరు గోల్డెన్ టెంపుల్, అరుణాచలం, శ్రీరంగం వెళ్లవచ్చు.