...
...
Next Story

Special Trains : ఏపీ, తెలంగాణ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. స్పెషల్ ట్రైన్స్.. 50 స్టేషన్లలో స్టాప్‌!

Summer Special Trains : వేసవి కాలంలో అదనపు రద్దీని తగ్గించేందుకు, దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్-నహర్‌లగన్ మధ్య వారానికి ఒకసారి ప్రత్యేక రైళ్లను నడపనుంది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ప్రయాణికులకు కనెక్టివిటీ మరింత మెరుగవుతుంది.

Published on: Apr 7, 2026, 12:20:37 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని నహర్‌లగన్, తెలంగాణలోని సికింద్రాబాద్ నడుమ ప్రత్యేక రైలును నడుపుతుంది. దీంతో ప్రయాణికులకు మెరుగైన సదుపాయం అందనుంది. ఏప్రిల్ 10 నుండి మే 22 మధ్య నడిచే రైలు నెం. 07046 సికింద్రాబాద్ – నహర్‌లగన్, శుక్రవారాల్లో ఉదయం 8.30 గంటలకు బయలుదేరి ఆదివారాల్లో సాయంత్రం 4 గంటలకు చేరుకుంటుందని సౌత్ సెంట్రల్ రైల్వే ఒక పత్రికా ప్రకటనలో ప్రయాణికులకు తెలియజేసింది.

c
c

అదేవిధంగా ఏప్రిల్ 13 నుండి మే 25 మధ్య నడిచే రైలు నెం.07047 నహర్‌లగన్ - సికింద్రాబాద్ సోమవారాల్లో మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరి బుధవారాల్లో రాత్రి 10 గంటలకు చేరుకుంటుంది.

ఈ ప్రత్యేక రైళ్లు చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, ఎలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు, పలాస, బ్రహ్మాపూర్, బలూగావ్, సి.రోడ్, భద్రక్, బాలాసోర్, ఖరగ్‌పూర్, అండుల్, దంకుని, బర్ధమాన్, బోల్పూర్ ఎస్ నిక్టన్, రాంపూర్ హాట్, మాల్దా రోడ్, కిషన్‌గంజ్, అలుబారి రోడ్, న్యూ జల్పైగురి, న్యూ కూచ్ బెహార్, కోక్రాఝర్, న్యూ బొంగైగావ్, బార్‌పేట రోడ్, రంగియావంటి స్టేషన్‌లలో ఆగుతుంది.

వేసవి ప్రయాణ డిమాండ్‌ను నిర్వహించడానికి దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ - నహర్‌లగన్ మధ్య వారానికి ఒకసారి ప్రత్యేక 3ఏసీ రైళ్లను నడపనుంది. రైలు నెం. 07046 శుక్రవారాల్లో, రైలు నెం. 07047 సోమవారాల్లో బయలుదేరి, ఈ మార్గంలో 50కి పైగా స్టేషన్లలో ఆగుతాయి.

మరో ప్రత్యేక రైలు

దక్షిణ, తూర్పు భారతదేశాల మధ్య రద్దీని తగ్గించి ప్రయాణ సంబంధాలను బలోపేతం చేయడానికి, యశ్వంత్‌పూర్ జంక్షన్ మరియు కతిహార్ మధ్య నడిచే వీక్లీ స్పెషల్ ట్రైన్ సర్వీసు నెం.06571/06572ను రెండు వైపులా మరో 15 ట్రిప్పులకు పొడిగించారు. దీనివల్ల కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్ వంటి రాష్ట్రాల ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుతుంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe