...
...
Next Story

AP Degree Amissions 2026 : ఏపీలో డిగ్రీ అడ్మిషన్లు - రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల, ముఖ్య తేదీలు

ఏపీలో డిగ్రీ ప్రవేశాల రెండో విడత కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. అర్హులైన విద్యార్థులు ఈనెల 21లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

Published on: Sep 20, 2026, 07:22:38 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్‌లోని డిగ్రీ కాలేజీల్లో 2026-27 విద్యాసంవత్సరానికి గాను ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ఉన్నత విద్య కమిషనరేట్ మొదటి విడత అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేసి… ప్రస్తుతం ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం రెండో విడత (ఫేజ్-2) కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది.

రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం

డిగ్రీ అడ్మిషన్లు - రెండో విడత కౌన్సెలింగ్
డిగ్రీ అడ్మిషన్లు - రెండో విడత కౌన్సెలింగ్

రెండో విడత కౌన్సెలింగ్‌కు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను సెప్టెంబర్ 18న ఉన్నత విద్యాశాఖ జారీ చేసింది. నోటిఫికేషన్ వెలువడిన రోజు నుంచే అంటే సెప్టెంబర్ 18 నుంచే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత ఉన్న విద్యార్థులు సెప్టెంబర్ 21 వరకు ఆన్‌లైన్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవడానికి గడువు ఇచ్చారు.

అభ్యర్థుల ధృువపత్రాల పరిశీలన కోసం హెల్ప్ లైన్ సెంటర్లు (HLCs) సెప్టెంబర్ 20 నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఈ ప్రాసెస్ సెప్టెంబర్ 24 వరకు కొనసాగుతుంది. రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు తమకు ఇష్టమైన కళాశాలలు, కోర్సులను ఎంచుకునేందుకు (వెబ్ ఆప్షన్లు నమోదు) సెప్టెంబర్ 21 నుంచి సెప్టెంబర్ 23 వరకు అవకాశం కల్పించారు. ఒకవేళ ఎంచుకున్న వెబ్ ఆప్షన్లలో మార్పులు లేదా చేర్పులు చేసుకోవాలనుకుంటే సెప్టెంబర్ 24న ఎడిట్ చేసుకోవచ్చు.

సీట్ల కేటాయింపు, కాలేజీల్లో రిపోర్టింగ్

వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ముగిసిన అనంతరం, అభ్యర్థుల మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా సెప్టెంబర్ 27న సీట్ల కేటాయింపు (అలాట్‌మెంట్) ఫలితాలను వెల్లడిస్తారు. సీటు పొందిన విద్యార్థులు సెప్టెంబర్ 28 నుంచి సెప్టెంబర్ 30 తేదీల మధ్య తమకు కేటాయించిన కళాశాలల్లో నేరుగా హాజరై, సర్టిఫికెట్లతో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు…

  • విద్యార్థుల రిజిస్ట్రేషన్: సెప్టెంబర్ 21, 2026 వరకు అవకాశం ఉంటుంది.
  • హెచ్‌ఎల్‌సీ ద్వారా ప్రమాణపత్రాల పరిశీలన: సెప్టెంబర్ 20 నుండి సెప్టెంబర్ 24, 2026
  • వెబ్ ఆప్షన్ల నమోదు: సెప్టెంబర్ 21 నుండి సెప్టెంబర్ 23, 2026
  • వెబ్ ఆప్షన్ల మార్పుకు అవకాశం: సెప్టెంబర్ 24, 2026
  • సీట్ల కేటాయింపు (అలాట్‌మెంట్): సెప్టెంబర్ 27, 2026
  • కళాశాలల్లో రిపోర్టింగ్: సెప్టెంబర్ 28 నుండి సెప్టెంబర్ 30, 2026
  • అధికారిక వెబ్ సైట్ - https://cap.apcfss.in/

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks