...
...
Next Story

సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ టైమింగ్‌లో మార్పు.. కొత్త షెడ్యూల్ ఇదే

సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ షెడ్యూల్ మారింది. ఈ విషయాన్ని తెలుసుకుని ప్రయాణికులు దానికి తగ్గట్టుగా ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలి.

Published on: Feb 20, 2026, 11:19:27 IST
Advertisement

దేశంలోని వివిధ నగరాలన వేగంగా కనెక్ట్ చేసేందుకు వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది ప్రభుత్వం. వీటితో చాలా వేగంగా ఒక సిటీ నుంచి మరో సిటీకి వెళ్లొచ్చు. దీంతో చాలా మంది ఈ రైలును ఎంచుకుంటున్నారు. ఇక సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య రైలుకు మంచి డిమాండ్ ఉంది. చాలా ఈ రూట్‌లో ప్రయాణిస్తుంటారు. అయితే సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ షెడ్యూల్‌లో మార్పు జరిగింది.

వందే భారత్ ఎక్స్ ప్రెస్
వందే భారత్ ఎక్స్ ప్రెస్

ఈ అప్డేట్ చేసిన షెడ్యూల్ రైలు నంబర్ 20707 కు వర్తిస్తుంది. ఇది తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌లను రద్దీగా ఉండే 699-కి.మీ రూట్‌ను కలుపుతోంది. విశాఖపట్నం జంక్షన్‌లో రద్దీని తగ్గించడానికి 2026 ఫిబ్రవరి 20 నుండి సవరించిన మార్పు అమల్లోకి వస్తుంది. రైలు నంబర్ 20707 సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రాక సమయాలను సవరించాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ నిర్ణయించింది. ఈ రైలు గురువారం మినహా అన్ని రోజులలో నడుస్తుంది. రెండు నగరాల మధ్య ప్రయాణికులు దీనిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.

ప్లాట్‌ఫారమ్ లభ్యతను మెరుగుపరచడానికి, టెర్మినల్ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి భారతీయ రైల్వే విశాఖపట్నం జంక్షన్‌లో రాక షెడ్యూల్‌ను సర్దుబాటు చేశాయి. రైలు నంబర్ 20707 (సికింద్రాబాద్ - విశాఖపట్నం) అప్డేట్ చేసిన షెడ్యూల్ :

  • సికింద్రాబాద్‌లో 05:00 గంటలు బయలుదేరుతుంది.
  • విశాఖపట్నంలో కొత్తగా చేరుకునే సమయం 1:50 గంటలు
  • అంతకుముందు ఈ సమయం మధ్యాహ్నం 1:45 గంటగా ఉండేది.

రైలు నంబర్ 20708 (విశాఖపట్నం - సికింద్రాబాద్) టైమింగ్ :

  • విశాఖపట్నం మధ్యాహ్నం 02:30 గంటలు బయలుదేరుతుంది.
  • సికింద్రాబాద్‌కు రాత్రి 11:25 గంటలకు చేరుకుంటుంది.

ఫిబ్రవరి 20వ తేదీ నుండి విశాఖపట్నంలోని టెర్మినల్‌లో రద్దీని తగ్గించడానికి ప్రత్యేకంగా ఈ కొత్త షెడ్యూల్‌ను అమలు చేశారు. సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ఆరు స్టేషన్లలో ఆగుతుంది. వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోటలో ఉంది. ఈ రైలు 699 కి.మీ. దూరాన్ని 8 గంటల 50 నిమిషాల్లో పూర్తి చేస్తుంది. ఈ కారిడార్‌లో అత్యంత వేగవంతమైన కనెక్షన్‌లలో ఒకటిగా ఈ సర్వీస్‌కు డిమాండ్ ఉంది. తిరుగు ప్రయాణ రైలు 20708, దాని షెడ్యూల్ సమయాలకు అనుగుణంగా కొనసాగుతుంది.

విశాఖపట్నం టెర్మినల్‌లో ప్లాట్‌ఫారమ్ నిర్వహణ, రద్దీ తగ్గించడానికి విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సమయాన్ని స్వల్పంగా ఐదు నిమిషాల మార్పు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe