పశ్చిమగోదావరి జిల్లా సిద్ధాంతంలో జరిగిన ‘మీ భూమి- మీ హక్కు’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. "భూమి రైతులదైతే... గత పాలకులు పొలం సరిహద్దు రాళ్లు, పాస్ పుస్తకాలపై తమ సొంత బొమ్మలు ముద్రించుకున్నారు. భూతం తరహాలో రైతుల వెంటపడి, ప్రజల సొమ్ము రూ.800 కోట్లు పెట్టి గెలాక్సీ గ్రానైట్ రాళ్లపై బొమ్మలు వేసుకున్న దుర్మార్గుల పాలన అది.' అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

బ్రిటిషర్ల కాలం నాటి పటిష్టమైన రెవెన్యూ రికార్డులను గత పాలకులు ల్యాండ్ టైటిలింగ్ యాక్టు పేరిట ఒక నల్ల చట్టాన్ని తెచ్చి తారుమారు చేశారని, భూములు కాజేసేందుకు ప్రయత్నించారని చంద్రబాబు మండిపడ్డారు. తాము అధికారంలోకి రాగానే ఆ నల్ల చట్టాన్ని రద్దు చేసి భూ యాజమాన్య హక్కులను రక్షించామని స్పష్టం చేశారు. ఒక వ్యక్తి చేసిన దుర్మార్గాన్ని ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వానికి మూడేళ్ల సమయం పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు.
క్యూఆర్ కోడ్, బ్లాక్ చెయిన్ టెక్నాలజీ వంటి అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సరికొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను జారీ చేస్తున్నామని సీఎం ప్రకటించారు. కరెన్సీ నోట్లకు ఉండే అన్ని రకాల భద్రతా ఫీచర్లతో, అధికారిక 'రాజముద్ర'తో వీటిని ముద్రిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 6,688 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేసి, 26.46 లక్షల మందికి పుస్తకాలు అందజేశామని.. మిగిలిన 62.32 లక్షల మందికి కూడా నిర్దేశిత గడువులోగా పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు.
రైతులకు మేలు చేసేలా రెవెన్యూ వ్యవస్థను వివాద రహితంగా తీర్చిదిద్దుతున్నట్లు సీఎం వివరించారు. ఇప్పటికే 1836 గ్రామాల్లో తుది రికార్డ్ ఆఫ్ రైట్స్ పూర్తి చేశామన్నారు. అమ్మకం, బహుమతి, విభజన వంటి 9 లక్షల లావాదేవీలకు 100 శాతం ఆటో మ్యుటేషన్ తెచ్చామని, వాట్సాప్ ద్వారా ట్రాకింగ్ సదుపాయం కల్పించామన్నారు.
'రూ.10 లక్షల లోపు ఆస్తుల వారసత్వ బదిలీని కేవలం రూ.100 తోనే చేస్తున్నాం. అంతకు మించితే రూ.1,000 స్టాంప్ డ్యూటీ చాలు. 1.37 లక్షల ఎకరాల విలేజ్ సర్వీస్ ఇనామ్ భూములను, 15 జిల్లాల్లోని 33,012 ఎకరాల షరతు గల పట్టా భూములపై ఉన్న ఆంక్షలను తొలగించి హక్కుదారులకు అప్పగించాం. చిత్తూరు జిల్లా శెట్టిపల్లి భూముల వివాదాన్ని కూడా పరిష్కరించాం.' అని చంద్రబాబు అన్నారు.
{{/usCountry}}'రూ.10 లక్షల లోపు ఆస్తుల వారసత్వ బదిలీని కేవలం రూ.100 తోనే చేస్తున్నాం. అంతకు మించితే రూ.1,000 స్టాంప్ డ్యూటీ చాలు. 1.37 లక్షల ఎకరాల విలేజ్ సర్వీస్ ఇనామ్ భూములను, 15 జిల్లాల్లోని 33,012 ఎకరాల షరతు గల పట్టా భూములపై ఉన్న ఆంక్షలను తొలగించి హక్కుదారులకు అప్పగించాం. చిత్తూరు జిల్లా శెట్టిపల్లి భూముల వివాదాన్ని కూడా పరిష్కరించాం.' అని చంద్రబాబు అన్నారు.
{{/usCountry}}ఉమ్మడి గోదావరి జిల్లాలు దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణలని సీఎం చంద్రబాబు కొనియాడారు. గత ప్రభుత్వంలో ధాన్యం అమ్ముకోవడానికి రైతులు ఇబ్బంది పడేవారని, ఆరు నెలలైనా డబ్బులు వచ్చేవి కావని.. కానీ నేడు కూటమి ప్రభుత్వంలో 24 గంటల్లోనే ధాన్యం డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని తెలిపారు. అన్నదాత సుఖీభవ కింద కేంద్రంతో కలిపి ఏడాదికి రూ.20 వేలు ఇస్తూ, ఇప్పటికే 46 లక్షల మంది రైతులకు రూ.8,985 కోట్లు జమ చేశామన్నారు.
పశ్చిమాసియా యుద్ధం వల్ల ఆక్వా రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని, దాణా రేట్లు పెరగడంతో సోయాబీన్ మీల్ దిగుమతులపై సుంకాలు తగ్గించాలని కేంద్రాన్ని కోరామని, త్వరలోనే నిర్ణయం వస్తుందని చంద్రబాబు తెలిపారు. ఆక్వా జోన్ పరిధిలోని చెరువులకు రూ.1.50 కే యూనిట్ విద్యుత్ అందిస్తున్నట్లు ప్రకటించారు. వ్యర్థాల నుంచి న్యూట్రాసిటికల్ ఔషధాలు తయారు చేసేలా పరిశ్రమలను ప్రోత్సహిస్తామన్నారు.
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్ల పాలన పూర్తి చేసుకుందని, అభివృద్ధి-సంక్షేమం-సుపరిపాలనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని సీఎం చెప్పారు. గత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పులు మిగిల్చిందని దుయ్యబట్టారు.