...
...
Next Story

జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. బయటకు షాకింగ్ వీడియో!

జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై ఓ మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Updated on: Jan 28, 2026, 05:25:09 IST
Advertisement

రైల్వే కోడూరు జనసేన శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్ పై ఒక మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ఇప్పటివరకు పోలీసులకు అధికారికంగా ఎటువంటి ఫిర్యాదు అందలేదు. ఆన్‌లైన్‌లో విడుదలైన వీడియో స్టేట్‌మెంట్‌లో ఒక మహిళ చేసిన ఆరోపణల ప్రకారం, ఎమ్మెల్యే దాదాపు ఒకటిన్నర సంవత్సరం పాటు తనను లైంగికంగా దోపిడీ చేశాడని తెలుస్తోంది. ఈ ఆరోపణలకు సంబంధించిన వీడియోలు, ఛాయాచిత్రాలు, వాట్సాప్ చాట్‌లు, రీల్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అయ్యాయి.

అరవ శ్రీధర్(ఫైల్ ఫొటో)
అరవ శ్రీధర్(ఫైల్ ఫొటో)

ఎమ్మెల్యే అయిన తర్వాత శ్రీధర్ మొదట ఫేస్‌బుక్ ద్వారా తనను సంప్రదించాడని, ఆ తర్వాత తనకు లొంగిపోవాలని బెదిరించాడని ఆ మహిళ తన వీడియో స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. ఎమ్మెల్యే తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని, బలవంతంగా సంబంధం పెట్టుకున్నాడని సంచలన ఆరోపణలు చేసింది. ఫలితంగా తాను గర్భవతి అయ్యానని ఆ మహిళ తెలిపింది.

తన ఇష్టానికి విరుద్ధంగా గర్భస్రావం చేయించుకోవలసి వచ్చిందని ఆ మహిళ ఆరోపించింది. శ్రీధర్ తనను వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చాడని చెప్పింది. తన భర్త నుండి విడిగా నివసిస్తున్నానని, విడాకులు తీసుకోవాలని ఎమ్మెల్యే తనపై ఒత్తిడి తెచ్చారని పేర్కొంది.

తన డిమాండ్లను పాటించకపోతే మూడేళ్ల కొడుకును చంపేస్తానని ఎమ్మెల్యే బెదిరించాడని, బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడని కూడా ఆ మహిళ ఆరోపించింది. ఎమ్మెల్యేను వెంటనే అరెస్టు చేయాలని వైసీపీ డిమాండ్ చేసింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఈ అంశాన్ని లేవనెత్తుతూ స్వతంత్ర సంస్థతో విచారణ జరపాలని డిమాండ్ చేసింది. ఆరోపణలకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

మరోవైపు అరవ శ్రీధర్ తల్లి ప్రమీల ఈ వివాదంపై స్పందించారు. తమ కుమారుడిపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. ఆ మహిళ కులం పేరు చెప్పి తన కుమారుడికి దగ్గరైందన్నారు. ఆ తర్వాత ఇంటికి రావడం మెుదలుపెట్టిందన్నారు. పగలు, రాత్రీ లేకుండా తన కుమారుడికి ఫోన్లు కూడా చేసేదని తెలిపారు. శ్రీధర్‌ను పెళ్లిచేసుకోమంటూ చాలాసార్లు బ్లాక్ మెయిల్ చేసిందన్నారు. సాయం కోసం వచ్చి తన కుమారుడిని అభాసుపాలు చేసిందని ఆరోపించారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe