విజయవాడ డివిజన్లో టికెట్ చెకింగ్ డ్రైవ్.. మూడు రోజుల్లోనే రూ.1.22 కోట్లు!
దక్షిణ మధ్య రైల్వేలోని విజయవాడ డివిజన్లో టికెట్ చెకింగ్ డ్రైవ్లో అత్యధిక ఆదాయం నమోదైంది. మూడు రోజుల్లోనే సౌత్ సెంట్రల్ రైల్వే రూ.1.22 కోట్లు సంపాదించింది.
దక్షిణ మధ్య రైల్వేలోని విజయవాడ డివిజన్ అక్టోబర్ 13 నుండి 15 వరకు నిర్వహించిన ప్రత్యేక ఇంటెన్సివ్ డ్రైవ్లో అత్యధిక టికెట్ చెకింగ్ ఆదాయాన్ని నమోదు చేసింది. 17,017 కేసుల నుండి మొత్తం రూ.1.22 కోట్లు సంపాదించింది. ఈ డివిజన్ అక్టోబర్ 13న రూ. 37.03 లక్షలు, అక్టోబర్ 14న రూ. 40.26 లక్షలు, అక్టోబర్ 15న ఆల్టైమ్ గరిష్టంగా రూ.45.03 లక్షలు ఆర్జించింది. ఇది డివిజన్ చరిత్రలో టికెట్ల తనిఖీ ద్వారా ఒకే రోజు అత్యధిక ఆదాయంగా అధికారులు చెప్పారు.

మూడు రోజుల పాటు జరిగిన ఈ ప్రత్యేక డ్రైవ్లో ప్రతిరోజూ రైళ్లు, స్టేషన్లలో 716 మంది టికెట్ తనిఖీ సిబ్బందిని నియమించారు. అధికారులు పూర్తిస్థాయిలో తనిఖీలు చేశారు. ఈ టీమ్స్ టికెట్ లేకుండా ప్రయాణించినందుకు 7,928 కేసులు, సరైన రైలులో ప్రయాణించినందుకు 9,034 కేసులు, బుకింగ్ చేయకుండా సామాను తీసుకెళ్తున్న కేసులను నమోదు చేశాయి. వీటికి వరుసగా రూ.72.28 లక్షలు, రూ.49.96 లక్షలు, రూ.0.09 లక్షల జరిమానాలు విధించారు.
విజయవాడ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనాకియా.. టీమ్ పనితీరును అభినందించారు. ఈ రికార్డు పనితీరు తమ టికెట్ చెకింగ్ సిబ్బంది కృషి, అప్రమత్తతకు, వాణిజ్య విభాగం కచ్చితమైన సమన్వయానికి నిదర్శనం అన్నారు. తనిఖీల ద్వారా కొత్త బెంచ్మార్క్ను పెట్టినందుకు మొత్తం బృందాన్ని అభినందనలు తెలిపారు. బాధ్యతాయుతమైన ప్రయాణం చేయాలని ప్రయాణికులను కోరారు.
ప్రయాణీకులు రైల్వే అధికారులతో సహకరించాలని, చెల్లుబాటు అయ్యే టిక్కెట్లతో ప్రయాణించాలని విజయవాడ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ బి. ప్రశాంత కుమార్ విజ్ఞప్తి చేశారు. ప్రయాణికులు తమ ప్రయాణ సమయంలో అసౌకర్యాన్ని నివారించడానికి ఎల్లప్పుడూ సరైన టిక్కెట్లు లేదా పాస్లతో ప్రయాణించాలని అభ్యర్థించారు. జరిమానాలు పడకుండా సౌకర్యవంతమైన ప్రయాణం చేయాలన్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


