SCR Charlapalli Narasapur Weekly Express Trains : తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. చర్లపల్లి - నర్సాపూర్ మధ్య కొత్తగా వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలు సర్వీసును ప్రకటించింది. ఈ ట్రైన్( 17061/17062)… ఏపీ, తెలంగాణలోని పలు రైల్వే స్టేషన్లలో ఆగనుంది.
దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలోని వివరాల ప్రకారం, ఈ కొత్త సర్వీసులను వేర్వేరు తేదీల్లో ప్రారంభించనున్నారు. ఆ వివరాలు కింది విధంగా ఉన్నాయి…
- రైలు నంబర్ 17062 (నర్సాపూర్ - చర్లపల్లి): ఈ రైలు ఏప్రిల్ 26, 2026 (ఆదివారం)వ తేదీన నర్సాపూర్ నుంచి ప్రారంభమవుతుంది. ప్రతి ఆదివారం రాత్రి 20:00 గంటలకు నర్సాపూర్లో బయలుదేరి….. మరుసటి రోజు సోమవారం ఉదయం 07:50 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది.
- రైలు నంబర్ 17061 (చర్లపల్లి - నర్సాపూర్): ఈ రైలు మే 2, 2026 (శనివారం) నుంచి అందుబాటులోకి రానుంది. ప్రతి శనివారం రాత్రి 19:50 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి…. ఆదివారం ఉదయం 07:00 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది.
ఆగే స్టేషన్లు….
ఈ వీక్లీ ఎక్స్ప్రెస్ రైలు నల్గొండ, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, వీరవాసరం, పాలకొల్లు స్టేషన్లలో ఆగుతుంది. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ రైలులో అన్ని రకాల తరగతులను అందుబాటులోకి తెచ్చారు. ఇందులో సెకండ్ ఏసీ (2A), థర్డ్ ఏసీ (3A), స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ (General) కోచ్లు ఉంటాయి. ప్రయాణికులు తమ బడ్జెట్ మరియు సౌకర్యానికి అనుగుణంగా బెర్తులను బుక్ చేసుకోవచ్చని దక్షిణ మధ్య రైల్వే సూచింది.
సెలవు రోజులతో పాటు పండగ సమయాల్లో సొంతూళ్లకు వెళ్లే ఐటీ ఉద్యోగులు, వ్యాపారులు మరియు విద్యార్థులకు ఈ వీక్లీ ఎక్స్ప్రెస్ ఎంతగానే ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఈ వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలు సేవలను వినియోగించుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.
{{/usCountry}}సెలవు రోజులతో పాటు పండగ సమయాల్లో సొంతూళ్లకు వెళ్లే ఐటీ ఉద్యోగులు, వ్యాపారులు మరియు విద్యార్థులకు ఈ వీక్లీ ఎక్స్ప్రెస్ ఎంతగానే ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఈ వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలు సేవలను వినియోగించుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.
{{/usCountry}}