విజయవాడ - గుంతకల్లు, తిరుపతి - వికారాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు... తేదీలివిగో
ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో దక్షిణ మధ్య రైల్వే మరో అప్డేట్ ఇచ్చింది. విజయవాడ, వికారాబాద్, తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ రైళ్లు ఏపీ, తెలంగాణలోని పలు స్టేషన్లలో ఆగుతాయి.
Published on: Jan 15, 2026 6:02 AM IST
సంక్రాంతి పండగ వేళ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని రైల్వే స్టేషన్లలో రద్దీ నెలకొంది. అయితే ప్రయాణికుల రద్దీని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్న దక్షిణ మధ్య రైల్వే.... ప్రత్యేక రైళ్లను ప్రకటిస్తోంది. తాజాగా మరో 4 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ రైళ్లు తెలుగు రాష్ట్రాల్లోని పలు స్టేషన్లలో ఆగుతాయి.

- దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలోని వివరాల ప్రకారం.... విజయవాడ - గుంతకల్లు మధ్య జనవరి 16వ తేదీన ట్రైన్ ఉంటుంది. రాత్రి 7 గంటలకు విజయవాడ నుంచి బయల్దేరి... మరునాడు తెల్లవారుజామున 4.30 గంటలకు గుంతకల్లుకు చేరుకుంటుంది. ఈ ట్రైన్ గుంటూరు, నర్సరావుపేట, వినుకొండ, దోనకొండ, మార్కాపురం, కుంభం, నంద్యాల, డోన్ రైల్వే స్టేషన్లలో ఆగుతుంది.
- ఇక మచిలీపట్నం - ధర్మవరం మధ్య జనవరి 16వ తేదీతో స్పెషల్ ట్రైన్ ఉంటుంది. ఈ ట్రైన్ సాయంత్రం 6 గంటలకు బయల్దేరి.. మరునాడు ఉదయం 6.30 గంటలకు ధర్మవరం చేరుకుంటుంది. ఈ ట్రైన్ గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట, పీలేరు, మదనపల్లె, కదిరి స్టేషన్లలో ఆగుతుంది.
- వికారాబాద్ - నాందేడ్ మధ్య జనవరి 20వ తేదీన స్పెషల్ ట్రైన్ ఉంటుంది. ఈ రైలు... ఉదయం 11.30 గంటలకు వికారాబాద్ నుంచి బయల్దేరి అదే రోజు రాత్రి 8.30 గంటలకు నాందేడ్ చేరుకుంటుంది. ఈ ట్రైమ్ శంకర్ పల్లి, లింగంపల్లి, బేగంపేట, సికింద్రాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, బాసర మీదుగా వెళ్తుంది.
- వికారాబాద్ - తిరుపతి మధ్య జనవరి 19వ తేదీన స్పెషల్ ట్రైన్ నడవనుంది. ఈ ప్రత్యేక రైళ్లు సాయంత్రం 4.15 గంటలకు బయల్దేరి... మరునాడు ఉదయం 8.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. ఈ ట్రైన్... సత్తెనపల్లి, లింగంపల్లి, సికింద్రాబాద్, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది.
ఈ ప్రత్యేక రైళ్లలో 2ఏసీ, 3ఏసీ స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయి. ఈ ప్రత్యేక రైళ్ల సేవలను వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఓ ప్రకటన ద్వారా కోరారు.

E-Paper












