దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని సంక్రాంతి స్పెషల్ రైళ్లు.. ఈ రూట్లలో వెళ్తాయ్ చూడండి
సంక్రాంతి సందర్భంగా మరికొన్ని ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అంతేకాదు సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర రద్దీ తగ్గేందుకు హైదరాబాద్ చుట్టుపక్కల స్టేషన్లలో హాల్ట్లు కూడా ఇచ్చారు.
సంక్రాంతి పండుగ సీజన్లో ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున రద్దీని తగ్గించి, ప్రయాణికుల రాకపోకలను సులభతరం చేయడానికి దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్, చుట్టుపక్కల ఉన్న కీలక స్టేషన్లలో అదనపు ప్రత్యేక రైళ్లను, తాత్కాలిక హాల్ట్లను ప్రకటించింది. మరికొన్ని ప్రత్యేక రైళ్లను కూడా సౌత్ సెంట్రల్ రైల్వే నడుపుతోంది. సంక్రాంతి దృష్ట్యా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. తాజాగా మరికొన్నింటిని కూడా రైల్వే ప్రకటించింది.

దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ను సిర్పూర్ కాగజ్నగర్, విజయవాడతో కలుపుతూ ఎనిమిది అదనపు ప్రత్యేక రైళ్లను నడపనుంది.
హైదరాబాద్–సిర్పూర్ కాగజ్నగర్
ట్రైన్ నెం. 07469, 07470 హైదరాబాద్, సిర్పూర్ కాగజ్నగర్ మధ్య నాలుగు ట్రిప్పులు నడుస్తాయి.
ట్రైన్ నెంబర్ 07469 జనవరి 9, జనవరి 10, 2026 నుండి శుక్రవారాలు, శనివారాల్లో ఉదయం 7.55 గంటలకు హైదరాబాద్ నుండి బయలుదేరి, మధ్యాహ్నం 2.15 గంటలకు సిర్పూర్ కాగజ్నగర్ చేరుకుంటుంది.
ట్రైన్ నెంబర్ 07470 జనవరి 9, జనవరి 18, 2026 నుండి శుక్రవారాలు, ఆదివారాల్లో మధ్యాహ్నం 3.15 గంటలకు సిర్పూర్ కాగజ్నగర్ నుండి బయలుదేరి రాత్రి 10.20 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.
ఈ రైళ్లు సికింద్రాబాద్, చర్లపల్లి, భువనగిరి, ఆలేరు, జనగాం, ఘన్పూర్, కాజీపేట, ఉప్పల్, జమ్మికుంట, ఓదెల, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, రవీంద్రఖని, మందమర్రి, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ స్టేషన్లలో ఆగుతాయి. వీటిలో కేవలం జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు మాత్రమే ఉంటాయి.
హైదరాబాద్-విజయవాడ
ట్రైన్ నెంబర్ 07471, 07472 కూడా హైదరాబాద్, విజయవాడ మధ్య నాలుగు ట్రిప్పులు నడుస్తాయి. ట్రైన్ నెం. 07471 జనవరి 9, జనవరి 10, 2026 నుండి శుక్రవారాలు, శనివారాల్లో ఉదయం 6.10 గంటలకు హైదరాబాద్లో బయలుదేరి, మధ్యాహ్నం 1.40 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.
ట్రైన్ నెం. 07472 జనవరి 9, జనవరి 18, 2026 నుండి ప్రారంభమయ్యే ప్రయాణాలతో శుక్రవారాలు, ఆదివారాల్లో మధ్యాహ్నం 2.40 గంటలకు విజయవాడలో బయలుదేరి రాత్రి 10.35 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.
ఈ రైళ్లు సికింద్రాబాద్, చర్లపల్లి, జనగాం, ఘన్పూర్, కాజీపేట, వరంగల్, నెక్కొండ, కేసముద్రం, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర స్టేషన్లలో ఆగుతాయి. వీటిలో జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు కూడా ఉంటాయి.
చర్లపల్లి-అనకాపల్లి
జనవరి 14, 15 తేదీలలో చర్లపల్లి-అనకాపల్లి మధ్య రెండు అదనపు ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. ట్రైన్ నెం. 07097 జనవరి 14, 2026న రాత్రి 7.30 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 9.30 గంటలకు అనకాపల్లి చేరుకుంటుంది.
ట్రైన్ నెం. 07098 జనవరి 15, 2026న సాయంత్రం 5.35 గంటలకు అనకాపల్లిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8.15 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.
ఈ రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, ఏలమంచిలి స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైలులో ఏసీ ఫస్ట్ క్లాస్, ఏసీ టూ టైర్, ఏసీ త్రీ టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు ఉంటాయి.
తాత్కాలిక హాల్టులు
పండుగ రద్దీని నిర్వహించడానికి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్పై ఒత్తిడిని తగ్గించడానికి హైటెక్ సిటీ, చర్లపల్లి, లింగంపల్లి స్టేషన్లలో తాత్కాలిక హాల్టులు కల్పించారు. జనవరి 7 నుండి జనవరి 20 వరకు బీదర్, మచిలీపట్నం, నర్సాపూర్, సాయినగర్ షిర్డీ, కాకినాడ, విశాఖపట్నం, ముంబైలను కలిపే సర్వీసులతో సహా మొత్తం పదహారు రైళ్లు హైటెక్ సిటీ స్టేషన్లో ఆగనున్నాయి.
అదే కాలంలో సికింద్రాబాద్-గూడూరు, లింగంపల్లి-కాకినాడ, హైదరాబాద్-విశాఖపట్నం, తిరుపతి-సికింద్రాబాద్, సికింద్రాబాద్-భువనేశ్వర్ వంటి మార్గాల్లో నడిచే పదకొండు రైళ్లు చర్లపల్లి స్టేషన్లో ఆగనున్నాయి.
నవంబర్ 1, 2025 నుండి ఏప్రిల్ 30, 2026 వరకు సికింద్రాబాద్, హైదరాబాద్ను రాజ్కోట్, పోర్బందర్, ముంబై, పూణే, తిరుపతి వంటి నగరాలతో కలిపే పది దూర ప్రాంత రైళ్లకు లింగంపల్లిలో హాల్టులు కల్పించారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


