రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక. దక్షిణ కోస్తా రైల్వే పరిధిలోని విజయవాడ డివిజన్, నరసాపురం యార్డ్లో కీలకమైన సిగ్నలింగ్, మౌలిక సదుపాయాల ఆధునీకరణ పనులను చేపట్టనుంది. ఈ అభివృద్ధి పనుల కారణంగా జూన్ 18, 19వ తేదీల్లో పలు రైలు సర్వీసులలో మార్పులు ఉంటాయని రైల్వే శాఖ అధికారిక ప్రటన విడుదల చేసింది.

జూన్ 18న ఉదయం 11:30 గంటల నుండి 24 గంటల డిస్కనెక్ట్, జూన్ 19న రెండు గంటల ట్రాఫిక్ బ్లాక్ విధించనున్నారు. దీనివల్ల విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, నిడదవోలు, నరసాపురం మార్గాల్లో నడిచే పలు రైళ్లు పాక్షికంగా రద్దవ్వడమే కాకుండా, పాలకొల్లు, భీమవరం జంక్షన్ స్టేషన్ల నుంచే షార్ట్ టెర్మినేట్ (ముందే నిలిపివేయడం) లేదా ప్రారంభం కానున్నాయి. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
షార్ట్ టెర్మినేట్ కానున్న రైళ్ల వివరాలు
రైలు నెం. 67243, 67280 (నిడదవోలు - నరసాపురం) జూన్ 18, 19 తేదీల్లో పాలకొల్లు వద్దే నిలిపివేస్తారు.
రైలు నెం. 67258 (విజయవాడ - నరసాపురం) జూన్ 18న పాలకొల్లు వరకే నడుస్తుంది.
రైలు నెం. 17281 (గుంటూరు - నరసాపురం) జూన్ 18న భీమవరం వరకు మాత్రమే ప్రయాణిస్తుంది.
రైలు నెం. 17263 (భీమవరం జంక్షన్ - నరసాపురం) జూన్ 19న పాలకొల్లుతోనే ముగుస్తుంది.
రైలు నెం. 67245 (నిడదవోలు - నరసాపురం) జూన్ 19న పాలకొల్లు వద్దే ఆగిపోతుంది.
ఇతర స్టేషన్ల నుండి ప్రారంభమయ్యే రైళ్లు
రైలు నెం. 67247 (నరసాపురం - గుంటూరు) జూన్ 18, 19 తేదీల్లో నరసాపురానికి బదులు పాలకొల్లు నుండి బయలుదేరుతుంది.
రైలు నెం. 67276 (నరసాపురం - విజయవాడ) జూన్ 18, 19 తేదీల్లో పాలకొల్లు నుండే ప్రయాణం ప్రారంభమౌతుంది.
{{/usCountry}}రైలు నెం. 67276 (నరసాపురం - విజయవాడ) జూన్ 18, 19 తేదీల్లో పాలకొల్లు నుండే ప్రయాణం ప్రారంభమౌతుంది.
{{/usCountry}}రైలు నెం. 67246 (నరసాపురం - రాజమండ్రి) జూన్ 18న పాలకొల్లు నుండి నడుస్తుంది.
రైలు నెం. 17282 (నరసాపురం - గుంటూరు) జూన్ 19న భీమవరం జంక్షన్ నుండి ప్రారంభమవుతుంది.
రైలు నెం. 67279 (నరసాపురం - నిడదవోలు), 17270 (నరసాపురం - విజయవాడ) జూన్ 19న పాలకొల్లు నుండే సర్వీసులు మొదలవుతాయి.
సురక్షితమైన, మెరుగైన రైలు కార్యకలాపాల కోసం జరుగుతున్న ఈ మార్పులను గమనించి, ప్రయాణికులు తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని దక్షిణ కోస్తా రైల్వే తెలిపింది.
దక్షిణ కోస్తా రైల్వే విజయవాడ డివిజన్, నరసాపూరం యార్డ్లో కీలకమైన సిగ్నలింగ్, మౌలిక సదుపాయాల పనులను చేపట్టనుంది. ప్రయాణికులు ప్రయాణానికి ముందు రైలు స్టేటస్ చెక్ చేసుకొని, తదనుగుణంగా ప్రణాళిక వేసుకోవాలని సూచించింది. సురక్షితమైన, మెరుగైన కార్యకలాపాల కోసం కృషి చేస్తున్నామని, ప్రజలు సహకరించాలని అధికారులు కోరారు.