ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల నాటి కల సాకారమైంది. భారతీయ రైల్వేలో సరికొత్త అధ్యాయం మొదలైంది. దేశంలోనే కొత్తగా ఏర్పాటైన సౌత్ కోస్ట్ రైల్వే (SCoR - దక్షిణ కోస్తా రైల్వే) జోన్ నేటి నుంచే (జూన్ 1) తన అధికారిక కార్యకలాపాలను ప్రారంభించింది.

గత ఏడాది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నంలో ఈ జోన్ ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. తాజా జోన్ ఏర్పాటుతో దేశంలో మొత్తం రైల్వే జోన్ల సంఖ్య 18కి చేరుకుంది. ఈ చారిత్రాత్మక ఘట్టంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ.. 'దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రారంభం కావడంతో ఏపీ ప్రజల చిరకాల కాంక్ష నెరవేరింది. ఈ కొత్త జోన్ ఉత్తరాంధ్ర రవాణా రంగాన్ని, ఆర్థిక ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేయబోతోంది.' అని ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు.
రైల్వే చట్టం 1989 ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త జోన్ ఏర్పాటుకు సంబంధించి గత మే 4వ తేదీన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతమున్న ఈస్ట్ కోస్ట్ రైల్వే (ECoR), సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) జోన్లను పునర్వ్యవస్థీకరించి దీనిని ఏర్పాటు చేశారు.
ఈ నోటిఫికేషన్ ప్రకారం.. ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలోని ప్రసిద్ధ వాల్తేరు డివిజన్ రెండు ముక్కలైంది. ఒక భాగం ఈస్ట్ కోస్ట్ రైల్వేలోనే ఉంటూ.. 'రాయగడ డివిజన్'గా రూపాంతరం చెందింది. రెండో భాగం కొత్తగా ఏర్పడిన సౌత్ కోస్ట్ రైల్వేలో విలీనమై.. 'విశాఖపట్నం డివిజన్'గా మారింది.
కొత్త విశాఖపట్నం డివిజన్ రూట్ వివరాలు (మొత్తం పొడవు: 463 కి.మీ)
- ఇచ్చాపురం – పలాస – విశాఖపట్నం – దువ్వాడ (270 రూట్ కి.మీ)
- విజయనగరం – కునేరు (102 రూట్ కి.మీ)
- నౌపడ జంక్షన్ – పర్లాకిమిడి(39 రూట్ కి.మీ)
- బొబ్బిలి జంక్షన్ – సాలూరు (17 రూట్ కి.మీ)
పెరిఫెరల్ లైన్స్ (సింహాచలం నార్త్-దువ్వాడ బైపాస్, వడలపూడి-దువ్వాడ, విశాఖపట్నం-జగ్గయ్యపాలెం తదితరాలు కలిపి - 35 రూట్ కి.మీ)
దక్షిణ తీర రైల్వే జోన్ పరిధిలోని 4 డివిజన్లు
{{/usCountry}}పెరిఫెరల్ లైన్స్ (సింహాచలం నార్త్-దువ్వాడ బైపాస్, వడలపూడి-దువ్వాడ, విశాఖపట్నం-జగ్గయ్యపాలెం తదితరాలు కలిపి - 35 రూట్ కి.మీ)
దక్షిణ తీర రైల్వే జోన్ పరిధిలోని 4 డివిజన్లు
{{/usCountry}}ఈ కొత్త జోన్ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తరించి ఉండటంతో పాటు తెలంగాణ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు కూడా సేవలందిస్తుంది. రైళ్ల నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడానికి, మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేయడానికి ఈ జోన్ ఉపయోగపడుతుంది.
- విశాఖపట్నం (కొత్తగా పునర్వ్యవస్థీకరించబడింది)
- విజయవాడ
- గుంటూరు
- గుంతకల్
జూన్ 1 నుంచి కార్యకలాపాలు ప్రారంభించిన ఈ జోన్ పరిధిలో వేల మంది ఉద్యోగులు/సిబ్బంది విధులు నిర్వహిస్తారు. రద్దీ సమయాల్లో ఈ జోన్ రోజూ 500 కంటే ఎక్కువ ప్యాసింజర్ రైళ్లను, 800కు పైగా గూడ్స్ (సరుకు రవాణా) రైళ్లను పర్యవేక్షించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. రాష్ట్రంలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధి 3532 కిలోమీటర్ల ఉంటుంది.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన రేవులైన విశాఖపట్నం పోర్ట్, గంగవరం పోర్ట్, కృష్ణపట్నం పోర్ట్, కాకినాడ పోర్ట్లతో పాటు త్వరలో రాబోతున్న మూలపేట పోర్ట్ సరుకు రవాణాకు, మల్టీమోడల్ లాజిస్టిక్స్కు ఈ జోన్ అత్యంత కీలకంగా మారనుంది.
రైళ్ల మెయింటెనెన్స్ కోసం విజయవాడ, గుంతకల్, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లో వ్యాగన్ మెయింటెనెన్స్ డిపోలు, ఎలక్ట్రిక్ & డీజిల్ లోకో షెడ్లు, కోచ్ కేర్ సెంటర్లు వంటి అత్యాధునిక సదుపాయాలను ఈ జోన్ కలిగి ఉంది.