ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని ఇంటర్మీడియట్ విద్యార్థులు ఐఐటీ, నీట్ పరీక్షల్లో ఉన్నత ర్యాంకులు సాధించేందుకు వీలుగా ప్రత్యేక కోచింగ్ కార్యక్రమాలు నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో ఇంటర్మీడియట్, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖల పనితీరును సమీక్షిస్తూ.. విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం ఒక ప్రాధాన్యత అని మంత్రి అన్నారు. అధికారులు నాలుగు ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో, ప్రతి ప్రాంతంలోని నాలుగు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ప్రత్యేక కోచింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు.

ఇంటర్మీడియట్ జవాబు పత్రాల మూల్యాంకనం దాదాపు 70 శాతం పూర్తయిందని అధికారులు మంత్రికి తెలిపారు. విద్యా సంవత్సరం బుధవారం ప్రారంభం కాగా.. మొదటి సంవత్సరం ప్రవేశాలు ఏప్రిల్ 6 నుంచి మొదలవుతాయి. ప్రభుత్వ కళాశాలల్లోని విద్యార్థులకు ఏప్రిల్ 19లోగా ఉచిత పాఠ్యపుస్తకాలను పంపిణీ చేయనున్నారు.
ఇంటర్మీడియట్ స్థాయిలో డ్రాపౌట్లు లేకుండా చూడాలని, విద్యార్థులు చదువు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని లోకేష్ అధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కనీస సౌకర్యాలు కల్పించి, వాటిని కనీసం త్రీ-స్టార్ రేటింగ్కు అప్గ్రేడ్ చేయాలని కూడా పిలుపునిచ్చారు.
మన బడి-మన భవిష్యతు కార్యక్రమం కింద రూ. 2,034 కోట్ల నిధులను సమీకరిస్తున్నామని, ఇందులో భాగంగా రూ. 770 కోట్ల విలువైన పనులు పురోగతిలో ఉన్నాయని లోకేశ్ చెప్పారు. మధ్యాహ్న భోజనం నాణ్యతలో ఏమాత్రం లోపం కనిపించినా చర్యలు తీసుకుంటామని, ఆకస్మిక తనిఖీలు కూడా నిర్వహిస్తామని లోకేష్ అధికారులను హెచ్చరించారు.
అడల్డ్ ఏజ్ ఎడ్యుకేషన్పై సమీక్షిస్తూ.. ఈ ఏడాది 24.74 లక్షల మంది విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారని, దీంతో అక్షరాస్యత రేటు 73 శాతం నుంచి 83 శాతానికి పెరిగిందని మంత్రి తెలిపారు. వచ్చే ఏడాది నాటికి సంపూర్ణ అక్షరాస్యతను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.
నైపుణ్యాభివృద్ధి రంగంలో ఇప్పటివరకు 1.95 లక్షల మందికి ఉపాధి లభించిందని, 6.87 లక్షల మందికి శిక్షణ ఇచ్చినట్టుగా, ప్రస్తుతం 71,000 మందికి పైగా శిక్షణ పొందుతున్నారని అధికారులు తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ నిర్మాణ సంస్థల భాగస్వామ్యంతో అమరావతిలో ఒక వర్క్షాప్ను నిర్వహించేందుకు ప్రణాళికలు జరుగుతున్నాయి. జాతీయ నిర్మాణ అకాడమీ ఆధ్వర్యంలో అమరావతిలో సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్, మంగళగిరిలో సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను కూడా లోకేశ్ సమీక్షించారు.
{{/usCountry}}నైపుణ్యాభివృద్ధి రంగంలో ఇప్పటివరకు 1.95 లక్షల మందికి ఉపాధి లభించిందని, 6.87 లక్షల మందికి శిక్షణ ఇచ్చినట్టుగా, ప్రస్తుతం 71,000 మందికి పైగా శిక్షణ పొందుతున్నారని అధికారులు తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ నిర్మాణ సంస్థల భాగస్వామ్యంతో అమరావతిలో ఒక వర్క్షాప్ను నిర్వహించేందుకు ప్రణాళికలు జరుగుతున్నాయి. జాతీయ నిర్మాణ అకాడమీ ఆధ్వర్యంలో అమరావతిలో సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్, మంగళగిరిలో సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను కూడా లోకేశ్ సమీక్షించారు.
{{/usCountry}}