...
...
Next Story

Chicken Rates : శ్రావణమాసం ఎఫెక్ట్ - తెలుగు రాష్ట్రాల్లో దిగొచ్చిన చికెన్ ధరలు..!

Telangana AP Chicken Rates : శ్రావణమాసం ప్రారంభంతో తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా తగ్గాయి. పది రోజుల క్రితం కిలో రూ.300 వరకు ఉంటే…. ప్రస్తుతం రూ. 230-రూ. 240కి చేరింది.

Published on: Aug 16, 2026, 17:02:59 IST
Advertisement

Telangana AP Chicken Rates : పవిత్ర శ్రావణమాసం రాకతో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో చికెన్ మార్కెట్ గ్రాఫ్ మారిపోతోంది. పూజలు, వ్రతాలు, ఆధ్యాత్మిక నియమాల కారణంగా చాలా మంది ప్రజలు మాంసాహారానికి దూరంగా ఉంటుండటంతో చికెన్‌కు డిమాండ్ తీవ్రంగా పడిపోయింది. దీని ప్రభావం ధరలపై స్పష్టంగా కనిపిస్తోంది.

తగ్గుతున్న చికెన్ ధరలు…

చికెన్
చికెన్

కేవలం 10 రోజుల క్రితం వరకు చుక్కలు చూపించిన చికెన్ ధరలు ఇప్పుడు ఒకేసారి దిగివచ్చాయి. పది రోజుల కిందటి వరకు రెండు రాష్ట్రాల్లోనూ స్కిన్‌లెస్ చికెన్ కిలో రూ.280 నుంచి రూ.300 (కొన్ని ప్రాంతాల్లో రూ.310 దాకా) విక్రయించారు. అయితే శ్రావణమాస నియమాలు ప్రారంభం కావడంతో వినియోగం తగ్గి, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా కిలో చికెన్ ధర రూ.230 నుంచి రూ.240 పరిధిలోనే లభిస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు, ప్రాంతాల వారీగా మార్కెట్ పరిస్థితిని పరిశీలిస్తే…. ఏపీలోని విజయవాడ, గుంటూరు, అనకాపల్లి, వైజాగ్ తదితర ప్రాంతాల్లో స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.220 నుంచి రూ.240 వద్ద కొనసాగుతోంది. ఇక తెలంగాణలోని హైదరాబాద్‌తో పాటు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, నల్లగొండ ప్రాంతాల్లోనూ కాస్త అటుఇటుగా ఇదే రేట్లు అమలవుతున్నాయి.

హైదరాబాద్ పరిసరాల్లో స్కిన్‌లెస్ చికెన్ రూ. 240 నుంచి రూ.250 వరకు ఉండగా, లైవ్ కోళ్ల ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. డిమాండ్ పడిపోవడంతో విక్రయాలు ఆశించిన స్థాయిలో సాగడం లేదని, ఉదయం నుంచి సాయంత్రం వరకు షాపుల వద్ద గిరాకీ చాలా తక్కువగా ఉంటోందని చికెన్ వ్యాపారులు చెబుతున్నారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe