Srisailam To Somnath : శ్రీశైలం నుంచి సోమనాథ్ యాత్ర.. భక్తుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

Srisailam To Somnath : శ్రీశైలం ఆలయం భక్తులను సోమనాథ్ యాత్రకు తీసుకెళ్లనుంది. ఇందుకోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి ఉన్న భక్తులు వెంటనే దరఖాస్తులు సమర్పించాలి.

Published on: Aug 30, 2026, 09:09:17 IST
By , Srisailam
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం భక్తుల కోసం ఒక విశేష అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది. గుజరాత్‌లోని ప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రమైన సోమనాథ్‌లో జరగనున్న సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ – 1,000 ఇయర్స్ ఆఫ్ అన్‌బ్రోకెన్ ఫెయిత్ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వీలుగా ప్రత్యేక తీర్థయాత్రను నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు శ్రీశైల దేవస్థానం ఒక ప్రకటన విడుదల చేసింది.

శ్రీశైలం మల్లన్న ఆలయం
శ్రీశైలం మల్లన్న ఆలయం

సోమనాథ్ ఆలయంపై చారిత్రక దాడి జరిగి 1,000 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని, అలాగే భారత స్వాతంత్య్రానంతరం ఈ మహా క్షేత్రాన్ని పునర్నిర్మించి 75 ఏళ్లు పూర్తయిన ఘట్టాన్ని పురస్కరించుకుని ఈ ప్రత్యేక వేడుకలను నిర్వహిస్తున్నారు. భారతీయ సంస్కృతి, ధర్మం, విశ్వాసాల పునరుజ్జీవనానికి సంకేతంగా నిలిచే ఈ ఉత్సవాల్లో భాగస్వామ్యమయ్యేందుకు శ్రీశైల క్షేత్రం నుండి సుమారు 50 మంది భక్తులను ఎంపిక చేయాలని దేవస్థానం నిర్ణయించింది.

ఈ ప్రత్యేక తీర్థయాత్రకు వెళ్లాలనుకునే భక్తులు తమ వివరాలతో పాటు గుర్తింపు కార్డు ప్రతిని (ఐడీ ప్రూఫ్) ఆగస్టు 30వ తేదీ (ఆదివారం) సాయంత్రం 5:00 గంటలలోపు శ్రీశైలం దేవస్థానంలోని పబ్లిక్ రిలే‌షన్ డిపార్ట్‌మెంట్‌లో అందజేయాలని అధికారులు సూచించారు.

తీర్థయాత్రకు హాజరయ్యే భక్తులు భౌతికంగా పూర్తి ఆరోగ్యంగా ఉండాలని దేవస్థానం తెలిపింది. ఎటువంటి తీవ్రమైన దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు లేని వారు మాత్రమే ఈ యాత్రకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ప్రయాణ సమయం సుదీర్ఘంగా ఉండటం, యాత్రా ప్రాంగణాల్లో కాలినడకన ప్రయాణించాల్సి రావడంతో ఈ నిబంధనను తప్పనిసరి చేశారు.

సోమనాథ్, శ్రీశైల క్షేత్రాలు భారతదేశంలో ద్వాదశ జ్యోతిర్లింగాలకు అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైల మల్లికార్జున స్వామి క్షేత్రం, గుజరాత్‌లోని సోమనాథ్ క్షేత్రం రెండూ జ్యోతిర్లింగ స్థానాలు కావడం విశేషం.

సోమనాథ్ ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రథమమైనదిగా పరిగణిస్తారు. ఈ క్షేత్రం ఎన్నో ఒడిదొడుకులను తట్టుకుని, భారతీయ ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచింది. శ్రీశైలం నుంచి ఎంపిక చేసిన 50 మంది భక్తులకు రవాణా, వసతి, దర్శన ఏర్పాట్లను శ్రీశైల దేవస్థానమే దగ్గరుండి పర్యవేక్షిస్తుంది.

ఈ అరుదైన, ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన యాత్రలో పాల్గొనడానికి ఆసక్తి కలిగిన భక్తులు వెంటనే శ్రీశైలం దేవస్థానం పీఆర్‌ఓ విభాగాన్ని సంప్రదించి తమ దరఖాస్తులను సమర్పించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More