విద్యార్థులకు గుడ్న్యూస్.. వేసవి సెలవులు పొడిగింపు.. ఎన్ని రోజులు అంటే?
ఏపీ ప్రభుత్వం జూనియర్ కాలేజీలకు వేసవి సెలవులు పొడిగించింది. ఈ మేరకు ఇంటర్మీడియట్ విద్యా మండలి ఆదేశాలు జారీ చేసింది.
ప్రస్తుతం జరుగుతున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు (IPASE)-2026 దృష్ట్యా, ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యా మండలి (BIE) కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని అన్ని జూనియర్ కళాశాలల పునఃప్రారంభాన్ని 2026 జూన్ 1 నుండి జూన్ 6, 2026 వరకు వాయిదా వేసింది.

ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి పి. రంజిత్ బాషా మాట్లాడుతూ, సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 5 వరకు జరగాల్సి ఉందని, పలు కళాశాల ప్రాంగణాలను పరీక్షా కేంద్రాలుగా ఉపయోగిస్తున్నారని తెలిపారు. సిబ్బంది పరీక్షలకు సంబంధించిన విధుల్లో నిమగ్నమై ఉన్నారని వెల్లడించారు.
ఇంటర్మీడియట్ కోర్సులను అందించే అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ సహాయం పొందే, ప్రైవేట్, ప్రభుత్వ సహాయం పొందని, సహకార జూనియర్ కళాశాలలు, కాంపోజిట్ డిగ్రీ కళాశాలల పునఃప్రారంభ తేదీని జూన్ 1కి బదులుగా జూన్ 6, 2026కి సవరించినట్లు బోర్డు తెలిపింది. వేసవి సెలవులను జూన్ 5, 2026 వరకు పొడిగించినట్లు కూడా బోర్డు పేర్కొంది.
సంబంధిత అన్ని సంస్థల ప్రిన్సిపాల్లు, యాజమాన్యాలు సవరించిన షెడ్యూల్ను గమనించి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని రంజిత్ బాషా కోరారు. 2026-27 వార్షిక విద్యా క్యాలెండర్లోని మిగతా అన్ని సూచనలు, షెడ్యూల్లు యథాతథంగా ఉంటాయని స్పష్టం చేశారు.
గతంలో ప్రకటించిన టైమ్టేబుల్ ప్రకారం.. మే 28వ తేదీన ఉదయం సెషన్లో జరగాల్సిన ఫస్ట్ ఇయర్ పరీక్షలను జూన్ 5వ తేదీ ఉదయం (09:00 గంటల నుండి 12:00 గంటల వరకు) నిర్వహించనున్నారు.
జూన్ 5న జరిగే పరీక్షలు - సబ్జెక్టులు
- ఎకనామిక్స్ (ఆర్థికశాస్త్రం) పేపర్-1
- వృత్తి విద్యా కోర్సుల (Vocational) బ్రిడ్జి కోర్సు గణితం (Mathematics) పేపర్-1
- వృత్తి విద్యా కోర్సుల బ్రిడ్జి కోర్సు జీవశాస్త్రం (Biology) పేపర్-1
- మే 28వ తేదీన మధ్యాహ్నం సెషన్లో జరగాల్సిన సెకండ్ ఇయర్ పరీక్షలను కూడా జూన్ 5వ తేదీ మధ్యాహ్నం (02:30 గంటల నుండి 05:30 గంటల వరకు) నిర్వహించనున్నారు.
- మ్యాథమెటిక్స్ (గణితం) పేపర్-2B
- వృత్తి విద్యా కోర్సుల బ్రిడ్జి కోర్సు గణితం (Mathematics) పేపర్-2
- వృత్తి విద్యా కోర్సుల బ్రిడ్జి కోర్సు జీవశాస్త్రం (Biology) పేపర్-2
ఈ మార్పు ప్రకారం.. ఆయా సబ్జెక్టు విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్లాలని ఇంటర్ బోర్డు సూచించింది. పరీక్షా కేంద్రాలు, హాల్ టికెట్లలో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేసింది.
ఇక ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లను బోర్డు అధికారిక వెబ్ సైట్ https://bie.ap.gov.in/ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనమిత్ర వాట్సాప్ వేదికగా కూడా వీటిని అందుబాటులోకి ఉంచారు. 'మన మిత్ర' వాట్సాప్ నంబరు 9552300009 కు మెసేజ్ చేయడం ద్వారా విద్యార్థులు నేరుగా తమ మొబైల్లోనే హాల్టికెట్ను సులువుగా పొందే వీలుంది. డౌన్లోడ్ చేసుకోని విద్యార్థులు… పైన పేర్కొన్న విధంగా ప్రాసెస్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.
విద్యార్థులు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో తమ పేరు, ఫోటో, సంతకం, పరీక్షా కేంద్రం వివరాలు, రాసే సబ్జెక్టుల కోడ్లు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని అధికారులు సూచించారు. ఏవైనా తప్పులు ఉంటే వెంటనే కళాశాల యాజమాన్యాన్ని లేదా బోర్డు హెల్ప్లైన్ను సంప్రదించాల్సి ఉంటుంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


